‘నిన్ను మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి’: సంచలనం సృష్టించిన యువకుడి చివరి లేఖ
ఈపూరు మండలం బోడిశంభునివారిపాలెం సమీపంలో రోడ్డు పక్కన ఈనెల 21న చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మాచర్ల గోపిరాజు చివరి లేఖ సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. రొంపిచర్ల మండలం విప్పర్లకు చెందిన గోపిరాజు
ఈపూరు, న్యూస్టుడే: బాపట్ల జిల్లా ఈపూరు మండలం బోడిశంభునివారిపాలెం సమీపంలో రోడ్డు పక్కన ఈనెల 21న చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మాచర్ల గోపిరాజు చివరి లేఖ సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. రొంపిచర్ల మండలం విప్పర్లకు చెందిన గోపిరాజు వినుకొండలో పనులు చేసేవాడు. తాను సొంతూరు వెళుతున్నట్లు స్నేహితులతో చెప్పి పట్టణం దాటాక రోడ్డు పక్కనున్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతను ఓ లేఖ రాశాడు. ముందుగా తన మృతదేహాన్ని తన అన్నకు అప్పగించాలని ఫోన్ నంబరు రాశాడు. అనంతరం ప్రేయసిని సంబోధిస్తూ కవిత్వం రాశాడు ‘ఏ అమ్మాయి.. నువ్వే గెలిచావు.. నేనే ఓడిపోయా.. నేను ఏ తప్పూ చేయలేదు.. నేను ఎప్పుడూ ఓడిపోలా.. ఇపుడే ఓడిపోయా.. ఈ జన్మకు నీవే నా భార్య అని ఊహించుకున్నా.. కానీ నాకు ఆ అదృష్టం లేదు.. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా.. మర్చిపోవాలంటే ముందు చచ్చిపోవాలి.. ఐ మిస్యూ.. లైఫ్లో ఎప్పుడూ కనిపించను.. ‘నా చావుకు నేనే కారణం’ అని లేఖ ముగించాడు. ఇది చూసినవారు ప్రేమ కోసం ప్రాణం తీసుకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రాసిన లేఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి