అతివేగం.. నిద్ర మత్తు
ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో ఈనెల 1వ తేదీ తెల్లవారుజామున శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళుతోన్న ఆర్టీసీ బస్సును కారు ఢీ కొనడంతో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
జిల్లాలో తరచూ ప్రమాదాలు
పోలీసులు, రవాణా శాఖ సంయుక్తంగా పనిచేస్తేనే నివారణ
ఈనాడు డిజిటల్, చిత్తూరు, న్యూస్టుడే, తిరుపతి(నేరవిభాగం)
చంద్రగిరి మండలం కాశిపెంట్ల వద్ద గతనెలలో జరిగిన రోడ్డు ప్రమాదం
* ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో ఈనెల 1వ తేదీ తెల్లవారుజామున శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళుతోన్న ఆర్టీసీ బస్సును కారు ఢీ కొనడంతో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
* ఈ ఏడాది జనవరి 25న తిరుమల శ్రీవారిని దర్శించుకుని కాణిపాకం బయలుదేరిన మహారాష్ట్ర భక్తులకు చెందిన కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న డివైడర్ గోడను ఢీ కొట్టడంతో నలుగురు ప్రమాదస్థలిలోనే దుర్మరణం చెందగా మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. అతివేగంతోనే ఈ ఘటన జరిగింది.
అతివేగం.. నిద్రమత్తుకు తోడు అవగాహన లేమితో జిల్లాలోని రహదారులు రక్తమోడుతున్నాయి. మృతుల్లో ఎక్కువమంది స్థానికేతరులే ఉంటున్నారు. తాజాగా శనివారం ఇదే తరహాలో పులిచెర్ల మండలంలో ప్రమాదం చోటుచేసుకుని నలుగురు మృతిచెందారు. అధిక శాతం ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమైనప్పటికీ జాతీయ రహదారులపై విధులు నిర్వర్తించే పెట్రోలింగ్ సిబ్బంది వాహనదారులను అప్రమత్తం చేస్తే కొంతవరకు ప్రాణనష్టాన్ని తప్పించవచ్చు. పోలీసులు, రవాణా శాఖ సంయుక్తంగా పనిచేస్తేనే ప్రమాదాలు నివారించవచ్చు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల సందర్శనకు నిత్యం వేలాది మంది జిల్లాకు వస్తుంటారు. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణకు అరుణాచలానికీ వెళుతుంటారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతోపాటు రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులకు జిల్లా రోడ్లపై ఏమాత్రం అవగాహన ఉండదు. త్వరగా గమ్యాన్ని చేరుకునేందుకు 100 కి.మీ.లపైగా వేగంతో వాహనాలు నడుపుతున్నారు. కొందరైతే సొంతంగానే వాహనాలు నడుపుతూ వస్తుండటం.. అందులోని ఒక్కరికే డ్రైవింగ్ రావడంతో అలసిపోయినా.. అతనే స్టీరింగ్ పట్టాల్సి వస్తోంది. నిద్ర లేమితో కంటి రెప్పలు మూతపడుతున్నాయి. ఈలోపే నష్టం జరిగిపోతోంది. మరికొందరు ముందుగా వెళుతున్న వాహనాలను తప్పించబోయి వాటినే ఢీ కొడుతున్నారు. ఈ తరహా ప్రమాదాలు చంద్రగిరి- నేండ్రగుంట మధ్య ఎక్కువగా జరిగాయి. కల్లూరు, భాకరాపేట, మొగిలి ఘాట్లో లారీలు మిట్ట ఎక్కేటప్పుడు ఒక్కసారిగా నిదానిస్తున్నాయి. వెనుక వస్తున్న కారు, బస్సు డ్రైవర్లు వేగాన్ని అదుపు చేయలేక లారీలను ఢీ కొడుతున్నారు.
పులిచెర్ల మండలం ఎంజేఆర్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో
శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన వాహనం
అరకొరగా స్పీడ్ గన్లు
జాతీయ రహదారులపై స్పీడ్ గన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అవి కూడా తిరుపతి- చిత్తూరు రోడ్డులో రెండు చోట్ల ఏర్పాటు చేశారు. ఇక్కడ వీటి సంఖ్య పెంచడంతోపాటు చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై కొత్తవి ఏర్పాటు చేసేలా రవాణా శాఖ అధికారులు చొరవ చూపాలి. తద్వారా అధిక వేగంతో వెళుతోన్న వాహనదారుడికి జరిమానా పడితే ఆ తర్వాత డ్రైవింగ్ చేసే విధానంలో మార్పు వచ్చి ప్రాణాలను కాపాడొచ్చు.
‘వాష్ అండ్ డ్రైవ్’ అమలు చేస్తే..
గతంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జాతీయ రహదారులపై విధులు నిర్వర్తించే పెట్రోలింగ్ సిబ్బంది దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నిలిపేవారు. డ్రైవర్ నీటితో ముఖాన్ని కడుక్కున్న తర్వాత ప్రయాణానికి అనుమతించేవారు. సిబ్బంది సక్రమంగా పనిచేస్తున్నారా? లేదాని తెలుసుకునేందుకు సీఐలు, డీఎస్పీలు అకస్మాత్తుగా వెళ్లే పరిస్థితి ఉంది. దీంతో ప్రమాదాల సంఖ్య కొంతవరకు తగ్గింది. ప్రస్తుతం ఈ విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్రుల ముసుగులో వైకాపా ఏజెంట్లు.. సజ్జల వ్యాఖ్యల నేపథ్యంలో విస్తృత చర్చ
[ 03-06-2024]
ఎన్నికల రోజున అల్లర్లు సృష్టించిన వైకాపా నాయకులు.. ఓట్ల లెక్కింపు రోజూ ఇదే పంథా ఎంచుకుంటారనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.. -
మాట వినకుంటే తాట తీయడమే..!
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపును పోలీసు శాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పోలింగ్ మరుసటి రోజు స్ట్రాంగ్ రూమ్ వద్ద తెదేపా అభ్యర్థిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఎస్పీ సహా ఎస్బీ డీఎస్పీ, ఇద్దరు సీఐలపై వేటువేసిన నేపథ్యంలో ఇంకా అధికార పక్షపాతం చూపిస్తే ఉద్యోగాలు పోతాయనే భయం పోలీసుల్లో కొంత మేరకు మార్పు తెచ్చింది. -
లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన జూన్ నాలుగో తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
విస్తరణకు నోచుకోని.. ఏపీ ఫైబర్ నెట్
[ 03-06-2024]
రాష్ట్రంలో ఏపీ ఫైబర్ నెట్ మూలకు చేరింది. ప్రతి ఇంటికి ఇవ్వాలని గత ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ను ఏర్పాటుచేసింది. -
నిర్ణయించేది ఉద్యోగులే..!
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు రానే వచ్చేసింది.. అభ్యర్థుల్లో ఆందోళన, ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. -
భద్రతను.. మాయం చేశారు
[ 03-06-2024]
జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఏర్పాటు చేసిన రక్షణ కవచాలు(ఇనుప రైలింగ్) అదృశ్యమయ్యాయి. -
టీసీ ఇచ్చేందుకు పేచీ
[ 03-06-2024]
తాము చదివిన పాఠశాలల్లో టీసీలు తీసుకోవాలనుకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముడుపులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. -
దివ్యాంగులని దిగులొద్దు...
[ 03-06-2024]
దివ్యాంగులంతా బడిబాట పట్టేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది.. చదువుకు దూరంగా ఉన్న ప్రత్యేక అవసరాలుగల పిల్లలను గుర్తించేందుకు సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నారు.. -
లెక్కింపులో అప్రమత్తంగా వ్యవహరించాలి: ఎస్పీ
[ 03-06-2024]
చిత్తూరు నగరంలోని ఎస్వీసెట్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎస్పీ మణికంఠ ఇతర అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు.
తాజా వార్తలు (Latest News)
-
జూన్ 4 వరకు ఆగండి.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారే: సోనియాగాంధీ
-
64.2 కోట్ల మంది ఓటర్లతో ప్రపంచ రికార్డు సృష్టించాం: ఈసీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు.. రూ.12.50 లక్షల కోట్ల లాభం!
-
పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారం.. వైకాపాకు సుప్రీంలో ఎదురుదెబ్బ
-
ఒమన్పై నమీబియా ‘సూపర్’ ఓవర్ విక్టరీ