అల్లర్లపై అప్రమత్తం
రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత సైతం పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగే ప్రమాదం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికలతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.
60 ప్రాంతాలు గుర్తించిన పోలీసులు
ముందస్తు చర్యలతోనే కట్టడి సాధ్యం
కూచివారిపల్లిలో మంగళవారం రాత్రి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మిక తనిఖీ
ఈనాడు-తిరుపతి : రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత సైతం పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగే ప్రమాదం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికలతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల రోజుతోపాటు తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఇక్కడ ఇప్పటికే ఆయా గ్రామాల్లో కవాతు నిర్వహించడంతోపాటు కార్డెన్ సెర్చ్ చేపడుతున్నారు. అయితే గత అనుభవాలు, ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దృష్టిలో ఉంచుకుని భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తేనే ఘర్షణలు నిరోధించేందుకు ఆస్కారం ఉంది.
ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రధానంగా నామినేషన్ల దాఖలు సమయంలోనే తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. అక్కడ మొదలు ఎక్కడో ఒకచోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో పోలీస్ అధికారులు వాటిని తేలిగ్గా తీసుకున్నారు. సాధారణంగా జరిగేవిగానే భావించారు. అయితే ఆ ప్రభావం ఎన్నికల రోజుతోపాటు తర్వాత చూపించాయి. ఎన్నిక రోజున రామచంద్రాపురం మండలం బ్రాహ్మణకాల్వలో బీఎస్ఎఫ్ జవాన్లు ఏకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. రామిరెడ్డిపల్లె, కూచువారిపల్లెల్లో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. అప్పటికీ పోలీసులు సరైన చర్యలు చేపట్టలేదు. దీని ఫలితంగానే శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్రూంల పరిశీలన సమయంలో తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. అప్పటి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఘర్షణలు జరుగుతాయోనని పలు ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
చంద్రగిరిలో 30 గ్రామాలు
ఓట్ల లెక్కింపు తర్వాతా ఘర్షణలు చోటుచేసుకునే ఆస్కారం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మొత్తం 60 ప్రాంతాల్లో చంద్రగిరి నియోజకవర్గంలోనే 30 సమస్యాత్మక గ్రామాలున్నట్లు తేల్చారు. ఇప్పటికే కీలక నేతల కదలికలపై ఆంక్షలు విధించారు. చంద్రగిరి, వెంకటంపేట, రామిరెడ్డిపల్లె, కూచువారిపల్లె, ఎ.రంగంపేట గ్రామాల పరిధిలో కవాతు నిర్వహించారు. శ్రీసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండూరు, కోట పరిధిలోని ప్రకాష్నగర కాలనీ, ఎన్టీఆర్ కాలనీల్లో కార్డన్ సెర్చ్ చేపట్టారు. ప్రస్తుతం రెండు సీఆర్పీఎఫ్ కంపెనీలు, సీఐఎస్ఎఫ్ బలగాలు విధ]ుల్లో ఉన్నాయి. అవసరమైతే మరిన్ని బలగాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండురోజుల కిందట దీనిపై ఎస్పీ హర్షవర్ధన్రాజు మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఎన్నికల సమయంలో భద్రత సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో నియమించామని, ఇప్పుడు అవసరంలేని ప్రాంతాల నుంచి వాళ్లను సమస్యాత్మకంగా ఉన్న చోట్ల నియమిస్తామని స్పష్టం చేశారు. బెండోవర్లు సైతం కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తంగా ముందస్తు చర్యల ద్వారానే ఘర్షణలు నివారించవచ్చని, ఇందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
16న శ్రీ భోగశ్రీనివాసుడికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం
[ 15-06-2024]
జూన్ 16వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం జరగనుంది. -
రెస్కో.. అవినీతి చూస్కో
[ 15-06-2024]
త్రిరాష్ట్ర కూడలి ప్రాంతమైన కుప్పం, సమీప మండలాల్లో నాణ్యమైన విద్యుత్తు నిరంతర సరఫరా కోసం పనిచేస్తున్న కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (రెస్కో) వైకాపా ప్రభుత్వ హయాంలో అవినీతికి కేరాఫ్గా మారింది. -
భూహక్కు.. సమస్యల చిక్కు
[ 15-06-2024]
చిగురుపాడుకి చెందిన కాటూరు సుబ్రహ్మణ్యం పదేళ్ల కిందట మరణించారు. ఆయనకు 1.92 ఎకరాలు భూమి ఉంది. ఆయన పేరుతోనే ఎల్పీ నంబరు కేటాయించి పట్టాదారు, అనుభవదారుగా 98 సెంట్లు ఉన్నట్లు నమోదు చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు హర్షణీయం
[ 15-06-2024]
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయడంపై చిత్తూరు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అశోక్ ఆనంద్ యాదవ్, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. -
సగం పాఠశాలల్లో గుడ్డు పెట్టలేదు
[ 15-06-2024]
పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందజేస్తున్నారు అందులో 1,200 పాఠశాలల్లో కోడిగుడ్డు పంపిణీ చేయగా 1,248చోట్ల గత రెండు రోజులుగా విద్యార్థులకు అందజేయలేదు. -
అనధికార తట్టలు, హ్యాకర్ లైసెన్సులు
[ 15-06-2024]
తిరుమలలో తరతరాలుగా ఉంటున్న ప్రజలకు ఉపాధి కల్పించేందుకు గతంలో తితిదే తట్టలు, హ్యాకర్ లైసెన్సులు, దుకాణాలు కేటాయించింది. -
అన్నదాత దరిచేరని విజ్ఞానం
[ 15-06-2024]
అన్నదాతకు వ్యవసాయంలో నూతన మెలకువలు నేర్పించి తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించే స్థాయికి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ పొలంబడి కార్యక్రమం రూపొందించింది. -
సర్వదర్శనానికి 18 గంటలు
[ 15-06-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు -
పరిశ్రమించేందుకు మరో అవకాశం
[ 15-06-2024]
పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతుల పనుల్లో కదలిక రానుంది. గత తెదేపా హయాంలో సాగి మధ్యలో వైకాపా సర్కార్ ఆపేసిన చెన్నై-విశాఖ పారిశ్రామిక నడవా(వీసీఐసీ) ప్రాజెక్టుల్లో ట్రెంచ్-1 పనులు గడవు పెంచారు. -
పుట్టినరోజు వేడుకలకు వెళ్తూ..
[ 15-06-2024]
స్నేహితుడి పుట్టినరోజే ఆ ముగ్గురు స్నేహితులకు జీవితంలో చివరి రోజైంది.. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేయాలని కేకు తీసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆ ముగ్గురిని ఐచర్ వాహనం మృత్యు రూపంలో వచ్చి బలిగొంది.. -
గణనాథుడి సేవలో సినీ నటుడు సాయి ధరమ్ తేజ్
[ 15-06-2024]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని సినీ హీరో సాయిధరమ్తేజ్ శుక్రవారం దర్శించుకున్నారు. -
విలీనంతో సరిపెట్టారు
[ 15-06-2024]
వైకాపా ప్రభుత్వంలో పలు గ్రామాలను సమీప పురపాలక సంఘాల్లో, నగరపాలక సంస్థల్లో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా విలీనం చేశారు. -
ఎస్వీయూలో బోధనేతర ఉద్యోగుల అల్టిమేటం
[ 15-06-2024]
ఎస్వీయూలోని బోధనేతర ఉద్యోగ సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ ఏకపక్ష నిర్ణయాలు, కక్ష సాధింపులకు ఊతం ఇచ్చేలా వర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. -
సిరి సంత.. సేంద్రియం చెంత
[ 15-06-2024]
మాది చిత్తూరు జిల్లా పలమనేరు. మిత్ర చిరుధాన్యాల ఉత్పత్తుల పేరుతో ఏళ్లుగా విక్రయాలు సాగిస్తున్నాం. ప్రస్తుతం 65 రకాల చిరుధాన్యాల ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నాం -
ఎస్పీసీహెచ్లో గుండెమార్పిడి శస్త్రచికిత్స
[ 15-06-2024]
శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మరో గుండె మార్పిడి శస్త్రచికిత్సను శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ.. కార్యకర్తల రుణం తీర్చుకుంటా: చంద్రబాబు
-
కోడెలపై పెట్టిన కేసు జగన్ మీద కూడా పెట్టొచ్చు కదా!: శివరాం
-
‘కోహ్లీ అలా చేస్తే రిషభ్ పంత్ సంతోషిస్తాడు’
-
వాహనదారులకు కర్ణాటక భారీ షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలపై వాత
-
రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక: మంత్రి నారాయణ
-
మినిస్టర్ పవన్కల్యాణ్.. అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చిన వదినమ్మ సురేఖ