గంగమ్మను స్మరించి.. విశ్వరూప దర్శనంతో తరించి
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ముగిసింది.
చెంప నరికే క్రతువుతో ముగిసిన జాతర
హారతి ఇస్తున్న విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు
తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్టుడే: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. ఈనెల 14న ప్రారంభమైన జాతర బుధవారం వేకువజామున గంగమ్మ విశ్వరూప ప్రతిమ చెంపకోసే కార్యక్రమంతో పూర్తయింది. వారంరోజుల పాటు నగరంలో జాతర సంబరాలు కనిపించాయి. వివిధ రకాల వేషధారణలతో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తప్పెట్లు, తాళాల ధ్వనులతో నగరం మార్మోగింది. బూతులు తిడుతూ భక్తులు సందడిగా బంధుమిత్రులతో కలిసి జాతరను సంతోషంగా ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు.
సూర్యకిరణాలు పడకుండా తెరను అడ్డుగా ఉంచిన విశ్వబ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు
చంప నరికే కార్యక్రమం ఆలస్యం.. గంగమ్మ గుడి ఆవరణలోని కొడి స్తంభానికి అమ్మవారి విశ్వరూప ప్రతిమ ఏర్పాటు చేస్తారు. మంగళవారం గర్భాలయంలోని గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేకం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటి గంట వరకు చేశారు. తర్వాత కొడి స్తంభం వద్ద అమ్మవారి మట్టి విగ్రహం తయారీకి ఉపక్రమించారు. పేరంటాళ్లు వచ్చి విశ్వరూప గంగమ్మ చంప కోస్తే జాతర ముగుస్తుంది. గతేడాది ఈ ప్రక్రియ వేకువ జామున 4 గంటలకే ముగించారు. బుధవారం సూర్యోదయం తర్వాత 6.40 గంటలకు నిర్వహించారు. కార్యక్రమం ఆలస్యంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అమ్మవారి విశ్వరూప ప్రతిమపై సూర్యకిరణాలు పడకుండా తెర ఏర్పాటు చేశారు. ఈ విషయంలో గంగమ్మ భక్తులు తిరుపతి ప్రజలు ఏమిటీ విచిత్ర పరిస్థితి అంటూ పెదవి విరిచారు.
మట్టికోసం..
కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం
పోటాపోటీగా లాక్కుంటున్న దృశ్యం
అమ్మవారికి సారె తెస్తున్న భక్తురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుమల ప్రక్షాళనకు వేళాయె..!
[ 16-06-2024]
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పలు సమస్యలు తిష్ఠవేశాయి. దర్శనానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుండగా గత ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత సంక్లిష్టంగా మారినట్లు ఆరోపణలున్నాయి. -
విలువల పుస్తకం.. బతుకు సంతకం
[ 16-06-2024]
బతుకు బండిని లాగే శ్రామికుడు అప్పుల తెడ్డులతో ఒడ్డుకు చేర్చే నావికుడు సుఖ సౌధాల అధిరోహణకు సోపానాలు నిర్మించిన కార్మికుడు కష్టాల చీకట్లలో సంతోషాల వెలుగులు పంచిన రేడు జీవన చెట్టును శాఖోపశాఖలుగా విస్తరింపజేసిన బాంధవుడు -
తోతాపురి మామిడి కాయల ధర పతనం
[ 16-06-2024]
మామిడిలో సింహభాగం వాణిజ్య పంట తోతాపురి మామిడికాయలు ధరలు మార్కెట్లో రోజురోజుకు పతనమవుతున్నాయి. -
నేడు తితిదే ఈవోగా శ్యామలరావు బాధ్యతల స్వీకారం
[ 16-06-2024]
తితిదే కార్యనిర్వహణాధికారిగా జె.శ్యామలరావు బాధ్యతలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముగిసిన తిరుపడి సిరి సంత
[ 16-06-2024]
మహతి ఆడిటోరియంలో మూడురోజుల పాటు జరిగిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు శనివారంతో ముగిశాయి. -
నెరవేరని ప్రభుత్వ ఆశయం
[ 16-06-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన హంద్రీనీవా కాలువలో నీరు పారలేదు. -
హామీలు అమలుతో ప్రజలకు చేరువ చేస్తాం
[ 16-06-2024]
దేశ చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు పథకాలను అమలు చేస్తూ సంతకాలు చేయడం చరిత్రాత్మకమని చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలుగా గెలిచిన జగన్మోహన్, మురళీమోహన్ పేర్కొన్నారు. -
శతాధిక వృద్ధురాలి మృతి
[ 16-06-2024]
మండలంలోని వీరప్పల్లె పంచాయతీ మంగప్పల్లె గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మృతి చెందింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నేను రెండు దెబ్బలే కొట్టా.. పోలీసు విచారణలో నటుడు దర్శన్ వెల్లడి?
-
ఆగస్టు 1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు
-
స్వీయ తప్పిదాలతోనే పాస్పోర్టు జారీలో ఆలస్యం
-
ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం.. త్వరలో చెత్త పన్నుకు చెల్లు చీటీ!