షాకిచ్చారు..
విద్యుత్తు అధికారులకు ఏపీఈఆర్సీ షాక్ ఇచ్చింది.. విద్యుత్తు శాఖ పౌరపట్టిక ప్రకారం వినియోగదారులకు సేవలందించడంలో అలసత్వం ప్రదర్శించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(ఏఈ), క్షేత్రస్థాయి అధికారులకు అపరాధ రుసుం విధించింది.
సేవలందించని ఇంజినీర్లకు జరిమానా
ఏఈలకు ఏపీఈఆర్సీ ఝలక్
న్యూస్టుడే, చిత్తూరు(మిట్టూరు)
విద్యుత్తు అధికారులకు ఏపీఈఆర్సీ షాక్ ఇచ్చింది.. విద్యుత్తు శాఖ పౌరపట్టిక ప్రకారం వినియోగదారులకు సేవలందించడంలో అలసత్వం ప్రదర్శించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(ఏఈ), క్షేత్రస్థాయి అధికారులకు అపరాధ రుసుం విధించింది.. రుసుం మొత్తాన్ని సంబంధిత ఇంజినీర్లు, అధికారుల వేతనాల నుంచి కోత విధించాలని ప్రతిపాదిస్తూ ఉత్తర్వులిచ్చింది.. ఉద్యోగుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని వెంటనే సంబంధిత వినియోగదారులకు చెల్లించాలని ఆదేశించింది.. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి 31 వరకు మూడు నెలల్లో సేవలు అందించని ఇంజినీర్లకు రూ.23,14,550 అపరాధ రుసుం విధించారు.
ఇలా చేసినందుకే..
ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ పరిధిలో ఎనిమిది డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో అన్ని రకాలకు సంబంధించి సుమారు 19.52లక్షల సర్వీసులు ఉన్నాయి. సర్కిల్ 99 సెక్షన్ కార్యాలయాలు ఉన్నాయి. నూతన సర్వీసులు జారీలో జాప్యం, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ ద్వారా ప్రస్తావనకు వచ్చిన సమస్యలు, పనుల అంచనా విలువ(ఎస్టిమెంట్లు)లకు వినియోగదారుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. వీటిని సకాలంలో పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత ఇంజినీర్లదే. అయితే ఈ విషయంలో వారు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. అంచనాలు సిద్ధంలో జాప్యం, విద్యుత్తు స్తంభాలు, లైన్లు, స్తంభాలు, మీటర్ల మార్పు, అధిక బిల్లింగ్ తదితర సమస్యలు పౌరపట్టిక ప్రకారం వారు పరిష్కరించలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఇలా అలసత్వం ప్రదర్శించిన 2,341 సర్వీసులకు సంబంధించి రూ.123,14,550 అపరాధ రుసుం విధించారు.
పెరుగుతోన్న సేవాలోపాలు..
మూడేళ్ల నుంచి సకాలంలో సేవలందించని వారికి ఏపీఈఆర్సీ అపరాధ రుసం విధిస్తోంది. అయినా ఇంజినీర్లలో ఆశించిన మేర మార్పు రాలేదు. కొందరు అపరాధ రుసుం నుంచి తప్పించుకునేందుకు సీనియారిటీ జాబితాలో దరఖాస్తులు తొలగిస్తున్నారు. గడువు దాటిన దరఖాస్తులు పక్కన పెట్టేస్తున్నారు. సేవా లోపం సమస్యలు నానాటికీ పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఫలితంగా వినియోగదారులు అవస్థ పడుతున్నారు.
సకాలంలో సేవలందించేలా చర్యలు..
పౌరపట్టిక నిబంధనలకు అనుగుణంగా వినియోగదారులకు సకాలంలో సేవలందించేలా చర్యలు తీసుకుంటాం. సకాలంలో సేవలందించని అధికారులకు ఏపీఈఆర్సీ అపరాధ రుసుం విధిస్తుంది.
కృష్ణారెడ్డి, ఎస్ఈ, తిరుపతి సర్కిల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుమల ప్రక్షాళనకు వేళాయె..!
[ 16-06-2024]
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పలు సమస్యలు తిష్ఠవేశాయి. దర్శనానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుండగా గత ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత సంక్లిష్టంగా మారినట్లు ఆరోపణలున్నాయి. -
విలువల పుస్తకం.. బతుకు సంతకం
[ 16-06-2024]
బతుకు బండిని లాగే శ్రామికుడు అప్పుల తెడ్డులతో ఒడ్డుకు చేర్చే నావికుడు సుఖ సౌధాల అధిరోహణకు సోపానాలు నిర్మించిన కార్మికుడు కష్టాల చీకట్లలో సంతోషాల వెలుగులు పంచిన రేడు జీవన చెట్టును శాఖోపశాఖలుగా విస్తరింపజేసిన బాంధవుడు -
తోతాపురి మామిడి కాయల ధర పతనం
[ 16-06-2024]
మామిడిలో సింహభాగం వాణిజ్య పంట తోతాపురి మామిడికాయలు ధరలు మార్కెట్లో రోజురోజుకు పతనమవుతున్నాయి. -
నేడు తితిదే ఈవోగా శ్యామలరావు బాధ్యతల స్వీకారం
[ 16-06-2024]
తితిదే కార్యనిర్వహణాధికారిగా జె.శ్యామలరావు బాధ్యతలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముగిసిన తిరుపడి సిరి సంత
[ 16-06-2024]
మహతి ఆడిటోరియంలో మూడురోజుల పాటు జరిగిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు శనివారంతో ముగిశాయి. -
నెరవేరని ప్రభుత్వ ఆశయం
[ 16-06-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన హంద్రీనీవా కాలువలో నీరు పారలేదు. -
హామీలు అమలుతో ప్రజలకు చేరువ చేస్తాం
[ 16-06-2024]
దేశ చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు పథకాలను అమలు చేస్తూ సంతకాలు చేయడం చరిత్రాత్మకమని చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలుగా గెలిచిన జగన్మోహన్, మురళీమోహన్ పేర్కొన్నారు. -
శతాధిక వృద్ధురాలి మృతి
[ 16-06-2024]
మండలంలోని వీరప్పల్లె పంచాయతీ మంగప్పల్లె గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నేను రెండు దెబ్బలే కొట్టా.. పోలీసు విచారణలో నటుడు దర్శన్ వెల్లడి?
-
ఆగస్టు 1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు
-
స్వీయ తప్పిదాలతోనే పాస్పోర్టు జారీలో ఆలస్యం
-
ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం.. త్వరలో చెత్త పన్నుకు చెల్లు చీటీ!
-
అక్రమాలకు అడ్డాగా జగనన్న కాలనీలు.. అడ్డగోలుగా బిల్లులు విడుదల