logo

కుటుంబమంతా జలసమాధి

బంధువుల ఇంట వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన ఆ కుటుంబాన్ని మృత్యువు రహదారి ప్రమాద రూపంలో కబళించింది. ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు తుదిశ్వాస విడిచారు. ఈ హృదయ విదారక ఘటన అన్నమమ్య

Published : 27 May 2022 05:41 IST

 కల్వర్టును ఢీకొని చెరువులో పడిన కారు
 భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లల మృతి


చెరువులో బోల్తా పడిన కారు

మదనపల్లె నేరవార్తలు: బంధువుల ఇంట వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన ఆ కుటుంబాన్ని మృత్యువు రహదారి ప్రమాద రూపంలో కబళించింది. ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు తుదిశ్వాస విడిచారు. ఈ హృదయ విదారక ఘటన అన్నమమ్య జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన మనోహర్‌రెడ్డి కుమారుడు గంగిరెడ్డి(43)కి తొమ్మిదేళ్ల కిందట రొంపిచెర్ల మండలం ఇ.రామిరెడ్డిగారిపల్లెకు చెందిన హేమావతి, సిద్ధారెడ్డి దంపతుల ఒక్కగానొక్క కుమార్తె మధుప్రియ(32)తో వివాహమైంది. వీరికి కుషితారెడ్డి(4), దేవాంష్‌రెడ్డి(2) పిల్లలున్నారు. తన వదిన సోదరి వివాహం పలమనేరులో జరుగుతుండటంతో గంగిరెడ్డి భార్యా పిల్లలతో కారులో బుధవారం పలమనేరుకు వెళ్లారు. గురువారం తెల్లవారుజామున ముహూర్తం చూసుకుని స్వగ్రామానికి బయలుదేరారు. మదనపల్లె గ్రామీణ మండలం 150 మైiలు గ్రామం వద్ద కారు రహదారి పక్కన కల్వర్టును ఢీకొట్టి పక్కనున్న మొరం చెరువులోకి పడిపోయింది. కారులో ఉన్న గంగిరెడ్డి, భార్య, ఇద్దరు పిల్లలు మృతిచెందారు. ఉదయాన్నే అటుగా వెళ్తున్న స్థానికులు చెరువులో కారు మునిగిపోవడంతోపాటు ఇద్దరు పిల్లల మృతదేహాలు నీటిలో తేలుతుండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 
గంగిరెడ్డి


మధుప్రియ (పాత చిత్రాలు) 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని