logo

నవంబరు 7 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం: కలెక్టర్‌

జిల్లా పరిధిలో గ్రాడ్యుయేట్‌, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు నవంబరు 7వరకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించిందని కలెక్టర్‌

Updated : 30 Sep 2022 03:42 IST

తిరుపతి (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లా పరిధిలో గ్రాడ్యుయేట్‌, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు నవంబరు 7వరకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించిందని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, జేసీ బాలాజీ, డీఆర్వో శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పరిధిలోని మండల తహసీల్దార్లతో కలెక్టర్‌ టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించి సూచనలిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని