logo

ఎంపీడీవో అత్యుత్సాహం

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎంపీడీవో ప్రమీలారాణి అత్యుత్సాహం ప్రదర్శించారు. కోటపోలూరులో బుధవారం మూడో విడత వైఎస్సార్‌ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.

Published : 30 Mar 2023 02:22 IST

ఆసరా చెక్కు పంపిణీ కార్యక్రమంలో ఈల వేస్తూ హడావుడి

వేదికపై ఈల వేస్తున్న ఎంపీడీవో ప్రమీలారాణి

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎంపీడీవో ప్రమీలారాణి అత్యుత్సాహం ప్రదర్శించారు. కోటపోలూరులో బుధవారం మూడో విడత వైఎస్సార్‌ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే సంజీవయ్యతోపాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి చిత్రపటానికి పొదుపు సంఘాల సభ్యులు పాలాభిషేకం చేయగా ఎంపీడీవో ఒక్కసారిగా ఈల వేస్తూ విజయచిహ్నం చూపుతూ హడావుడి చేశారు. బాధ్యత గల ప్రభుత్వ అధికారిణిగా ఉంటూ ఇలా చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని