రామచంద్రయాదవ్పై 28 కేసులు
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి.
ఆర్వో మధుసూదనరెడ్డికి నామినేషన్ పత్రాలు అందిస్తున్న బీసీవైపీ అభ్యర్థి రామచంద్రయాదవ్
పుంగనూరు: బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి మొత్తం 15 మంది 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు బీసీవైపీ తరఫున రామచంద్రయాదవ్ నాలుగు సెట్లు, తెదేపా తరఫున చల్లా రామచంద్రారెడ్డి -2, ఆయన కుమార్తె చల్లా పూజారెడ్డి-1, వైకాపా తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి-2, ఆయన సతీమణి స్వర్ణలత -2, ఎస్డీపీఐ తరఫున 1, స్వతంత్రులు -1 నామినేషన్ దాఖలు చేశారు.
ప్రధాన పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు’
నియోజకవర్గంలో వైకాపా, తెదేపా నాయకుల మధ్య చీకటి ఒప్పందాలు కొనసాగుతున్నాయని బీసీవైపీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఆరోపించారు. గురువారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక ఆర్వో కార్యాలయంలో పుంగనూరు నియోజకవర్గ బీసీవైపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్తులు పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. దౌర్జన్యాలు, అక్రమాలు అధికమయ్యాయని, ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని ఆరోపించారు.
ఆస్తుల వివరాలు
- నియోజకవర్గం: పుంగనూరు
- అభ్యర్థి: రామచంద్రయాదవ్
- పార్టీ: బీసీవైపీ
- విద్యార్హత: ఎంబీఏ
- స్థిరచరాస్తులు: రూ.10.36 కోట్లు
- బంగారం: 596 గ్రాములు
- అప్పులు: 1.82 కోట్లు
- కేసులు: 28
- నియోజకవర్గం: పూతలపట్టు
- అభ్యర్థి: ఎం.ఎస్.బాబు
- పార్టీ: కాంగ్రెస్
- విద్యార్హతలు: ఏడో తరగతి
- స్థిరచరాస్తుల విలువ: రూ.1.55 కోట్లు
- భార్య పేరిట: రూ.50 వేలు
- అప్పులు: లేవు
- కేసులు: నాలుగు క్రిమినల్ కేసులు
న్యూస్టుడే, పూతలపట్టు, ఐరాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
[ 04-05-2024]
మంత్రి రోజా ప్రచారాన్ని వడమాలపేట మండలం వేమాపురం గ్రామస్థులు శుక్రవారం రాత్రి అడ్డుకున్నారు. పూడి పంచాయతీలోని వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ప్రచారం నిర్వహించడానికి ప్రచారం రథంలో వచ్చారు. -
కళ్లు మూసుకున్నారా ఐదేళ్లు..
[ 04-05-2024]
‘రాజకీయ నాయకుడికి విలువలు, విశ్వసనీయత ఉండాలి. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేయాలి.’ -
ఈ పాపం నీదే జగన్..
[ 04-05-2024]
మండు టెండలో రెండో రోజూ వృద్ధులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేసేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా తన స్వార్థ ప్రయోజనం కోసం వేదనకు గురిచేశారు. -
నగరిలో సైకిల్ జోరు..
[ 04-05-2024]
నగరిలో మంత్రి రోజాను వ్యతిరేకిస్తూ అసమ్మతి నాయకులు ఇన్నాళ్లు గళం విప్పుతూ వచ్చారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా అధిష్ఠానం ఇచ్చింది. -
జగనే సర్పంచులకు గండం
[ 04-05-2024]
దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు వైకాపా ప్రభుత్వం పంచాయతీ నిధులనూ వదల్లేదు.. గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కన్న కలలను సీఎం జగన్ కల్లోలం చేశారు.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మార్చారు. -
మా బతుకులు రోడ్డున వేశావ్.. జగన్!
[ 04-05-2024]
కష్టాన్ని నమ్ముకున్న బడుగు జీవులు వైకాపా పాలనలో ఇసుక కొరతతో నానా అవస్థలు పడ్డారు. చేద్దామంటే పనుల్లేక.. తిందామంటే తిండిలేక.. ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేద్దామంటే పనుల్లేక.. పెరిగిన నిత్యావసరాల ధరలు భవన నిర్మాణ రంగ కార్మికులకు పూట గడవని పరిస్థితులు దాపురించాయి. -
మేనమామ.. క్రీడలపై సవతి ప్రేమ..!
[ 04-05-2024]
బటన్ నొక్కి పిల్లలకు మేనమామలా సంక్షేమం ఇచ్చానని చెప్పిన సీఎం జగన్. క్రీడాకారులపై మాత్రం సవతి ప్రేమ చాటారని క్రీడా లోకం మండిపడిపోతోంది. కమర్షియల్ క్రీడల్లో సాధనకు రుసుమల్ని పెంచి.. పేద ఆటగాళ్లను ఆటలకు దూరం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. -
చిత్తూరును స్మార్ట్సిటీని చేస్తా
[ 04-05-2024]
పేదలకు అండగా నిలవడం నాకు ఇష్టం.. జిల్లా కేంద్రమైనా చిత్తూరులో అభివృద్ధి జాడేలేదు.. యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై సహా విదేశాలకు వెళ్తున్నారు.. జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఆశయంతో రాజకీయాల్లోకి రాక ముందే జీజేఎం ట్రస్టు ద్వారా ప్రజాసేవకు శ్రీకారం చుట్టా.. -
‘భవన’దీయుడి కోసం
[ 04-05-2024]
నంది కూడలిలో ఉన్న ఈ అత్యాధునిక భవనం నగరపాలక సంస్థకు చెందినది. తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ నిధులు రూ.2 కోట్లు వెచ్చించి తిరుమలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం నిర్మించారు. -
వృద్ధులమని తెలుసు.. ఇంటికివ్వలేని మనసు
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వ చర్యలతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయట ఎండకు, బ్యాంకుల్లో ఉక్కపోతతో అల్లాడిపోయారు. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. -
బారుకు వెళ్తేనే బీరు
[ 04-05-2024]
ఎండాకాలంలో బీర్లకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. మండుటెండలో ప్రభుత్వ మద్యం దుకాణాలు తిరిగినా బీరు దొరక్క బార్ల మెట్లెక్కాల్సి వస్తోంది. రూ.350 - రూ.410 వరకు చెల్లించి బీర్లు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘తాపీ’గా లేం జగన్!
[ 04-05-2024]
వైకాపా సర్కార్ తెచ్చిన ఇసుక విధానం, సామగ్రి ధరల పెరుగుదల కూలీలకు శాపంగా మారింది. అరకొర పనులు, అప్పుల బాధలు, సమస్యలు భరించలేక కార్మికులు బలవన్మరణాలకు దారితీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడి.. పోలీసుల సమక్షంలోనే వైకాపా అరాచకం