T20 WC 2024: రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టు గురించి భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. సరైన జట్టును ఎంపిక చేశారని సెలక్టర్లను అభినందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ కోసం (T20 World Cup 2024) జట్టును ప్రకటించినప్పటి నుంచి పొగడ్తలు, విమర్శలు, సూచనలు వస్తున్నాయి. రింకు సింగ్ను తీసుకుంటే మంచిదని కొందరు.. హార్దిక్ ఎందుకని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా భారత జట్టు ఎంపికపై మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రింకు సింగ్ను రిజర్వ్లో పెట్టడానికి కారణాలను వివరించాడు. అత్యుత్తమ జట్టుతోనే రోహిత్ మెగా టోర్నీకి వెళ్తున్నాడని ప్రశంసించాడు.
‘‘వెస్టిండీస్ పిచ్లు చాలా మందకొడిగా ఉంటాయి. సెలక్టర్లు అదనంగా మరొక స్పిన్నర్ను ఎంపిక చేసి ఉంటారు. అందుకే, రింకు సింగ్కు అవకాశం దక్కి ఉండకపోవచ్చు. యువ బ్యాటర్ ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో మెరుస్తున్నాడు. భవిష్యత్తులో తప్పకుండా అవకాశం వస్తుంది. టీ20 ప్రపంచ కప్ టైటిల్ రేసులో భారత్, ఆస్ట్రేలియా ముందుంటాయని అనుకుంటున్నా. గత వన్డే వరల్డ్ కప్లో ఫైనల్లో ఈ రెండు జట్లే తలపడ్డాయి. మరోసారి ఆధిపత్యం ప్రదర్శిస్తాయి. టీమ్ఇండియా ఉత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతోంది. ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లే. రోహిత్, ద్రవిడ్ సరైన ప్లేయర్లనే ఎంచుకున్నారని భావిస్తున్నా’’ అని గంగూలీ తెలిపాడు.
కుల్చాదే హవా: చావ్లా
‘‘టీ20 ఫార్మాట్ వచ్చిన మొదట్లో ఎవరూ స్పిన్నర్లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా స్పిన్నర్లే ఉపయోగకరంగా మారారు. బంతి వేగంగా వస్తే సులువుగా బ్యాటింగ్ చేయొచ్చు. అదే నెమ్మదిగా టర్న్ అయితే దాని కోసం చాలా ఎనర్జీని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్లో చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కుల్దీప్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో భారత్ నాణ్యమైన ప్రదర్శన చేస్తుందని భావిస్తున్నా’’ అని సీనియర్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ను తీసుకుంది. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్కు చోటు కల్పించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పూరన్ దంచెన్
ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్ సీజన్ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. -
వానా వానా వద్దప్పా!
అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! -
సెమీస్లో సాత్విక్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
అప్పటి నుంచే ఆ ఆలోచన
అఫ్గానిస్థాన్తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్ సునీల్ ఛెత్రి చెప్పాడు. -
ఆర్జనలో రొనాల్డో నం.1
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. -
మను బాకర్ జోరు
ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మను బాకర్ జోరు కొనసాగుతోంది. -
పర్వీన్పై నిషేధం.. చేజారిన ఒలింపిక్ బెర్తు
బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. -
నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే
తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. -
ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. -
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి