మాటల జ‘గన్’.. చేతల చూ‘ఫన్’
కుప్పం పట్టణం, న్యూస్టుడే: ‘వైనాట్ కుప్పం అంటూ.. 2022 సెప్టెంబరు 23న ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల్లా కుప్పాన్ని చూస్తానని హామీ ఇచ్చారు.
కుప్పం ప్రజలపై కపట ప్రేమ
రూ.66 కోట్ల పనుల్లో పురోగతి నిల్
దుస్థితిలో ఉన్న దళవాయికొత్తపల్లె ఉద్యానవనం
కుప్పం పట్టణం, న్యూస్టుడే: ‘వైనాట్ కుప్పం అంటూ.. 2022 సెప్టెంబరు 23న ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల్లా కుప్పాన్ని చూస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసం రూ.66 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించేశారు. అదే తడవుగా స్థానిక నాయకులు రంగంలోకి దిగి ప్రచార డప్పు మోగించారు.
అనుమతులంటూ పరిహాసం
ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన ఏడాది తర్వాత పనులకు పరిపాలన అనుమతులు రావడంతో అదే పదివేలంటూ వైకాపా నాయకులే గుత్తేదారులుగా మారారు. వార్డుల్లో సీసీ రహదారులు, కాల్వల నిర్మాణాలు ప్రారంభించారు. బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే వదిలేశారు. కాల్వలు సిమెంట్ ఇటుకలతో కట్టడంతో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. సామాజిక భవనాల భూసేకరణే జరగలేదు. శ్మశనవాటిక, పార్కుల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ పనులే ప్రారంభం కాలేదు. పురపాలిక అభివృద్ధికి కేటాయించిన పనులు విస్మరిస్తూ.. పురపాలిక భవనాన్ని ఆగమేఘాల మీద పూర్తి చేశారు. సెంట్రల్ ఏసీగా మార్చేసి.. ఎన్నికల ముందే భవనాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఇదీ జగన్ కల్లబొల్లి మాటల తీరు.
వాసుదేవారోడ్డులో సిమెంటు ఇటుకలతో నిర్మిస్తున్న మురుగు కాల్వ
కేటాయింపులిలా..
ప్రతిపాదించిన నిధుల్లో ఒక్కో వార్డుకు రూ.2 కోట్ల చొప్పున 25 వార్డులకు సీసీ రహదారులు, మురుగు కాల్వలు నిర్మించాలని ప్రతిపాదించారు. రూ.80 లక్షలతో నాలుగు సామాజిక భవనాలు (గాండ్ల, బలిజ, నాయీబ్రాహ్మణ, బ్రాహ్మణ), కుప్పం శ్మశాన వాటిక (ఎలక్ట్రిక్ బర్నింగ్ యూనిట్, ఆధునికీకరణ)కు రూ.1.60 కోట్లు, పట్టణంలోని రెండు పార్కులకు రూ.3 కోట్లు, ప్రధాన వీధుల్లో రూ.1.8 కోట్లతో సెంట్రల్ లైటింగ్, రూ.5 కోట్లతో పురపాలక కార్యాలయం నిర్మాణానికి కేటాయించారు. మిగిలిన నిధులతో చిన్న చిన్న పనులు చేస్తామని పేర్కొన్నారు.
పూర్తైన పురపాలిక నూతన భవనం, ప్రతి గదికి ఏసీలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటెత్తిన చైతన్యం
[ 15-05-2024]
జిల్లా సరిహద్దు ప్రాంతమైన సత్యవేడులో రికార్డు స్థాయిలో 85.63% ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 83.25, సూళ్లూరుపేట నియోజకవర్గంలో 82.92 శాతం నమోదైంది. -
స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు భద్రం
[ 15-05-2024]
చిత్తూరు లోక్సభతో పాటు, ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయిన ఈవీఎంలను చిత్తూరు నగరం ఎస్వీసెట్లోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. -
పల్లె ఓటర్లు పోటెత్తారు!
[ 15-05-2024]
పల్లె ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడ్డారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు పోటెత్తి ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచారు. -
అంతరాలయంపై ఆలస్యమేల..!
[ 15-05-2024]
శ్రీకాళహస్తీశ్వరాలయంలో దళారుల దందాకు అడ్డుకట్ట వేసే దిశగా అంతరాలయ దర్శనం టికెట్ను అమలు చేయాలని అధికారులు, ధర్మకర్తల మండలి నిర్ణయించింది. -
ప్రచారం చేసినందుకు పంటకు నిప్పు
[ 15-05-2024]
మండలంలోని బూరుగుమాకులపల్లిలో రామేగౌడు ఇటీవల తెదేపా తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆరునెలల ముందు తెదేపా నుంచి వైకాపాలో చేరారు. -
విదేశాలకు మామిడి ఎగుమతులు
[ 15-05-2024]
అందరినీ నోరూరించే మామిడి సీజన్ ప్రారంభమైంది. జిల్లా నుంచి మామిడి కాయల ఎగుమతులు విదేశాలకు ప్రారంభమయ్యాయి. -
సర్పంచి ఇంటిపై వైకాపా మూకల దాడి
[ 15-05-2024]
మండలంలోని జగన్నాధపురం సర్పంచి రాణెమ్మ(ఇటీవల ఎన్నికలకు ముందు తెదేపాలో చేరారు) ఇంటిపై వైకాపా మూకలు దాడి చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. -
భార్యపై కత్తితో దాడి .. పరిస్థితి విషమం
[ 15-05-2024]
భార్యపై భర్త కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. మండల పరిధిలో చెన్నై బెంగళూరు జాతీయ రహదారిలోని లక్ష్మయ్యకండ్రిగ బస్సు స్టాప్లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. -
పాశవికం..!
[ 15-05-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిని హతమార్చేందుకు వైకాపా గూండాలు మంగళవారం బరితెగించారు. శ్రీపద్మావతి వర్సిటీలో ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్రూంల వద్దకు వచ్చిన నానిని అంతమొందించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అనుచరులు యత్నించారు. -
తిరుపతి గంగజాతరకు చాటింపు
[ 15-05-2024]
తిరుపతి ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం చాటింపుతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. -
వేసవిలో తాగనీటి ఎక్కిళ్లు
[ 15-05-2024]
వేసవిలో తాగునీటి ఎద్దడి ఎక్కువైంది. గ్రామీణ ప్రాంతాల్లో గుక్కెడు నీటికి కష్టమవుతోంది. అటు పంచాయతీ తాగునీటి పథకాలతో పాటు ఇతర పథకాలు దెబ్బతిన్నా సర్పంచులు వాటిని బాగు చేసే పరిస్థితులు లేవు. -
మాదే గెలుపు.. పందెమెంతో చెప్పు
[ 15-05-2024]
జిల్లాలో బెట్టింగుల జోరు ఎక్కువే. ఐపీఎల్ సీజన్లో జోరుగా బెట్టింగులు జరుగుతాయి. ఈ బెట్టింగులు ఒక వైపు ఉంటే.. -
నానిపై దాడి అమానుషం
[ 15-05-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి అమానుషమని తెదేపా కూటమి ఎంపీ,
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
-
తెలంగాణలో వర్సిటీల ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి
-
మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు గుడ్న్యూస్.. కేవైసీ నిబంధనల్లో సడలింపు
-
మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్ స్వీట్ రిప్లయ్!