రైలులో సైకో వీరంగం
మసీదుసెంటర్: రైలులో ఓ సైకో వీరంగం సృష్టించాడు. బీరుసీసాతో భార్యాభర్తలపై దాడి చేశాడు. ఆర్పీఎఫ్ సిబ్బంది, ప్రయాణికులు అతికష్టం మీద అతడిని పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.
బీరుసీసాతో భార్యాభర్తలపై దాడి
గంజాయి, మద్యం మత్తులో హల్చల్
నిందితుడ్ని పట్టుకుంటున్న ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
సాంబమూర్తినగర్ (కాకినాడ), మసీదుసెంటర్: రైలులో ఓ సైకో వీరంగం సృష్టించాడు. బీరుసీసాతో భార్యాభర్తలపై దాడి చేశాడు. ఆర్పీఎఫ్ సిబ్బంది, ప్రయాణికులు అతికష్టం మీద అతడిని పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. బాధితులు, రైలు ప్రయాణికుల వివరాల ప్రకారం.. ముంబయి వెళ్లే ఎల్టీటీ రైలు కాకినాడ పోర్టు స్టేషన్ నుంచి టౌన్ రైల్వేస్టేషన్కు బుధవారం ఉదయం 9.05 గంటలకు చేరుకుంది. 9.10 గంటలకు కదులుతున్న సమయంలో రైలు చివరి జనరల్ బోగీలో ఓ ఆగంతకుడు వీరంగం సృష్టించాడు. తనతో పాటు తెచ్చుకున్న బీరు బాటిల్ పగులగొట్టి ఎదురుగా ఉన్న తాడేపల్లిగూడెం వికాస్ కాలనీకి చెందిన ఎం.భవానీ పొట్టపై పొడవడంతో అక్కడే ఉన్న భర్త రవికుమార్ అడ్డుకున్నారు. అతనిపైనా దాడికి పాల్పడటంతో చేతికి తీవ్ర గాయమై రక్తస్రావమైంది.
జీజీహెచ్లో చికిత్స పొందుతున్న భార్యాభర్తలు..
బోగీలో హాహాకారాలు..
ప్రయాణికుల కేకలు, అరుపులు విని టీటీ రైలు నిలుపుదల చేయించారు. ఆర్పీఎఫ్ సీఐ కొండయ్య, జీఆర్పీ ఎస్ఐ రవికుమార్ సిబ్బందితో ఆ బోగీలోకి చేరుకున్నారు. ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుళ్లు చిట్టిబాబు, జి.సత్యనారాయణ, పాయింట్స్ మెన్ అతడిని పట్టుకున్నారు. చేతిలోని సీసా లాక్కొని రైలు నుంచి కిందకు దించగా వారిని ప్రతిఘటిస్తూ జేబులో ఉన్న మరో గాజుముక్కతో వారిపై దాడికి దిగాడు. దీంతో ప్రయాణికులు మూకుమ్మడిగా నిందితుడిపై దాడిచేశారు. మద్యం తాగి ఉన్నాడని కొందరు, గంజాయి మత్తులో ఉన్నాడని మరి కొందరు ప్రయాణికులు తెలిపారు. అప్పటికే అక్కడికి చేరుకున్న కాకినాడ వన్టౌన్, టూటౌన్ సీఐలు సైకోను స్టేషన్కు తరలించారు.
అసోంలో భార్యతో గొడవపడి..
నిందితుడు అసోంకు చెందిన సత్య బర్మాన్గా గుర్తించారు. ఆధార్ ద్వారా వివరాలు సేకరించారు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా స్వస్థలం నుంచి భీమవరం వచ్చి కొంతకాలం ఉన్నట్లు సమాచారం. గతంలో అతడికి నేరచరిత్ర ఉన్నట్లు సమాచారం. మతి స్థితిమితం సరిగా లేదని, సైకోగా ప్రవర్తిస్తుంటాడని పోలీసులు పేర్కొన్నారు. కొద్దికాలం క్రితం నిందితుడు సత్య బర్మాన్ను పట్టుకుని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్కు తీసుకు వెళ్లి విచారించినట్లు తెలసింది.
బాధితులకు జీజీహెచ్లో చికిత్స
నిందితుడి చేతిలో గాయపడిన భార్యాభర్తలు భవానీ, రవికుమార్ కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. భవానీకి పొట్ట భాగంలో గాయాలయ్యాయి. రవికుమార్ చేతికి గాయమైంది. ఇద్దరికి చికిత్స అందిస్తున్నట్లు జీజీహెచ్ వైద్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటనకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
[ 16-06-2024]
సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. -
కూటమి ప్రభుత్వ సహకారంతో ఎతిపోతల అభివృద్ధి
[ 16-06-2024]
పార్టీలకు అతీతంగా రైతులంతా ఎత్తిపోతల అభివృద్ధికి కృషి చేయాలని చాగల్లు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్య తెలిపారు. -
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
[ 16-06-2024]
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు దర్శించుకున్నారు. -
మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఫాదర్స్ డే వేడుకలు
[ 16-06-2024]
రోటరీ క్లబ్ నిడవోలు అధ్యక్షుడు కీర్తి ఆంజనేయులు ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఫాదర్స్డే వేడుకలు నిర్వహించారు. -
శ్రీకోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా సూపరింటెండెంట్
[ 16-06-2024]
మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంంలో కొలువై ఉన్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారిని తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ పి.జగదీశ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. -
నాన్నంటే నాన్నే
[ 16-06-2024]
నాన్నంటే ఇష్టంగా మోసే బాధ్యత.. వెన్నంటి నడిచే ధైర్యం.. ఊహకందని త్యాగం.. నడత నేర్పే గురువు.. తన జీవితాన్నే మనకోసం ధారబోసే మహోన్నతుడు. -
మానసిక సంఘర్షణ.. మృత్యుమార్గాన..
[ 16-06-2024]
ఆ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నత చదువులు చదివారు. మహానగరాల్లో ఉద్యోగాలు చేశారు. పదేళ్ల క్రితం తండ్రి చనిపోవడం.. తల్లి అనారోగ్యం బారిన పడటంతో ఇంటికొచ్చేశారు. -
అమ్మా.. నన్ను క్షమించు
[ 16-06-2024]
‘అమ్మా.. నన్ను క్షమించు. నా స్నేహితుడు శ్రీను.. వాళ్ల మావయ్య మోసం చేశాడు. రూ.35 లక్షలు ఇవ్వాలి. -
కొమ్మనాపల్లిలో అదుపులోకి రాని అతిసారం
[ 16-06-2024]
కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో ప్రబలిన (అతిసారం) మూడోరోజుకూ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. గ్రామంలోని మరో 28 మంది శనివారం కూడా అస్వస్థత బారిన పడ్డారు. -
వెంకన్న వేడుక చూద్దాం రండి
[ 16-06-2024]
పవిత్ర వైనతేయ నదీ తీరంలో కొలువైన అప్పనపల్లి బాలబాలాజీస్వామివారి ఆలయం ఉత్సవ శోభను సంతరించుకుంది. -
అన్నదాత ఆత్మ సంకల్పానికి దెబ్బ
[ 16-06-2024]
పుడమి తల్లిని నమ్ముకుని ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అడుగడుగునా సమస్యలే. విత్తు వేసింది మొదలు.. దిగుబడి వచ్చే వరకు, ఆ తర్వాత కూడా అనేక సవాళ్లు. -
అక్కడ కూలినా.. ఇక్కడ వేళ్లూనేలా..
[ 16-06-2024]
దశాబ్దాల క్రితం నాటి ఓ రావిచెట్టు కాకినాడ బాలాత్రిపుర సుందరి దేవాలయం రహదారిలో గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. -
పూలబాట పరిచిన పాదాలకు పుష్పాభిషేకం
[ 16-06-2024]
కాకినాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శనివారం ఫాదర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ తండ్రులపై చిన్నారులు పూలు చల్లి ఆశీర్వచనం తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐర్లాండ్ను ఆదుకున్న డెలానీ, లిటిల్.. పాకిస్థాన్ లక్ష్యం 107
-
తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
-
కోహ్లీ ఆటతీరుపై ఎలాంటి ఆందోళన లేదు.. మద్దతుగా నిలిచిన బ్యాటింగ్ కోచ్
-
ఓటీపీతో ఈవీఎం తెరవలేం - ‘మహా’ వివాదంపై ఎన్నికల అధికారి
-
చంద్రబాబు పోలవరం సందర్శన .. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రామానాయుడు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM