ఉచిత విద్య.. అంతా మిథ్య
రాజమహేంద్రవరానికి చెందిన కె.శ్రీనివాసరావు చిరుద్యోగి. ఇటీవల ఓ ప్రైవేటు పాఠశాలలో 25 శాతం రాయితీ సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆయన కుమార్తెకు సీటు వచ్చింది. ఆనందంతో వెళ్లి అన్ని ధ్రువపత్రాలు సమర్పించాడు.
ప్రకటనలకే పరిమితమవుతున్న 25 శాతం రాయితీ
న్యూస్టుడే, శ్యామలాసెంటర్
రాజమహేంద్రవరానికి చెందిన కె.శ్రీనివాసరావు చిరుద్యోగి. ఇటీవల ఓ ప్రైవేటు పాఠశాలలో 25 శాతం రాయితీ సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆయన కుమార్తెకు సీటు వచ్చింది. ఆనందంతో వెళ్లి అన్ని ధ్రువపత్రాలు సమర్పించాడు. ఇక ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుందని సంబరపడ్డాడు. మరుసటి రోజు సదరు స్కూల్నుంచి ఫోన్కాల్ వచ్చింది. మీ ఇంటిని ఒకసారి పరిశీలించాలని, కుటుంబీకుల ఉద్యోగ వివరాలు కావాలని చెప్పడంతో ఉలిక్కిపడ్డాడు. అన్నట్లుగానే వివరాలు తీసుకున్నారు. మా స్కూల్లో ఉచితంగా సీట్లు పొందిన వారినందరినీ కలిపి వేరే సెక్షన్లో వేస్తామని, వీరికి రెగ్యులర్ విద్యార్థుల మాదిరిగా సౌకర్యాలు ఉండవని చెప్పడంతో అతని ఆనందం ఆవిరైంది.
ఈ పరిస్థితి ఒక్క శ్రీనివాసరావుదే కాదు. జిల్లాలోని చాలామంది తల్లిదండ్రులకు ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ఎదురవుతున్న చేదు అనుభవాలివి.
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది మార్చి 31 నాటికి 2,622 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,209 మంది వివిధ పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. తొలిదశలో 1,541 మంది విద్యార్థులు ఎంపికవ్వగా కేవలం 993 మంది మాత్రమే పిల్లలను చేర్పించారు. వాస్తవానికి వీరందరూ ఈ నెల 10న ఆధార్, ఆదాయ, కుల ధ్రువపత్రాలు, పుట్టినతేదీ వివరాలు సమర్పించి ప్రవేశాలు పొందాలని డీఎస్ఈఓ కె.వాసుదేవరావు సూచించారు. ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలల నుంచి రకరకాల ఒత్తిళ్లు, చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓ పాఠశాల యాజమాన్యం మీ ఇంటి ఫొటో తీసుకోవాలి అంటే.. మరొకరు మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అక్కడికి వచ్చి చూస్తామంటున్నారు. మరికొందరైతే రెగ్యులర్ విద్యార్థుల మాదిరిగా పాఠాలు చెప్పమని, సౌకర్యాలు సైతం కల్పించమని తెగేసి చెబుతుండటం గమనార్హం. మరికొన్ని కార్పొరేట్ స్కూళ్లయితే ప్రభుత్వం చెల్లించేంది కేవలం ట్యూషన్ ఫీజుకు మాత్రమే సరిపోతుందని, అదనంగా మరికొంత చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం కల్పించిన రాయితీని వినియోగించుకోవాలో.. లేక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చెప్పిన డబ్బులు కట్టి చదివించుకోవాలో దిక్కుతోచక పేద తల్లిదండ్రులు అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్లాడుతున్నారు.
అధికారుల ఆదేశాలు బేఖాతరు
పది రోజుల క్రితం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో రాజమహేంద్రవరంలో పాఠశాలల తనిఖీ అధికారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. విద్యాహక్కు చట్ట ప్రకారం సీట్లు పొందిన వారికి ప్రవేశాలు ఇవ్వాలని సూచించారు. అయినప్పటికీ మార్పులేదు. ఈ సమావేశానికి పాఠశాల తరఫున తూతూమంత్రంగా ఎవరొ ఒకరిని పంపుతున్నారే తప్ప యాజమాన్యాలు సీరియస్గా తీసుకోవడం లేదు. నిబంధనలు పాటించని వారిపై విద్యాశాఖ చర్యలు తీసుకున్న సందర్భాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పలువురు బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తనిఖీలు చేపట్టి కొరడా ఝుళిపించాలని కోరుతున్నారు.
నేరుగా ఫిర్యాదు చేయండి..
-ఎస్.సుభాషిణి, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్రశిక్ష
ప్రభుత్వం ఎంపిక చేసిన తర్వాత ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మళ్లీ విద్యార్థుల ఇంటిని తనిఖీలు చేయడం వంటివి తగదు. అటువంటి సంఘటనలు ఎదురైతే నేరుగా వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. కఠిన చర్యలు తీసుకుంటాం. వేర్వేరు కారణాలతో ఎంపిక కాని విద్యార్థులకు రెండో దశలో మళ్లీ ప్రభుత్వం ప్రవేశాలు కల్పిస్తుంది. ఈ పథకాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్నంటే నాన్నే
[ 16-06-2024]
నాన్నంటే ఇష్టంగా మోసే బాధ్యత.. వెన్నంటి నడిచే ధైర్యం.. ఊహకందని త్యాగం.. నడత నేర్పే గురువు.. తన జీవితాన్నే మనకోసం ధారబోసే మహోన్నతుడు. -
మానసిక సంఘర్షణ.. మృత్యుమార్గాన..
[ 16-06-2024]
ఆ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నత చదువులు చదివారు. మహానగరాల్లో ఉద్యోగాలు చేశారు. పదేళ్ల క్రితం తండ్రి చనిపోవడం.. తల్లి అనారోగ్యం బారిన పడటంతో ఇంటికొచ్చేశారు. -
అమ్మా.. నన్ను క్షమించు
[ 16-06-2024]
‘అమ్మా.. నన్ను క్షమించు. నా స్నేహితుడు శ్రీను.. వాళ్ల మావయ్య మోసం చేశాడు. రూ.35 లక్షలు ఇవ్వాలి. -
కొమ్మనాపల్లిలో అదుపులోకి రాని అతిసారం
[ 16-06-2024]
కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో ప్రబలిన (అతిసారం) మూడోరోజుకూ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. గ్రామంలోని మరో 28 మంది శనివారం కూడా అస్వస్థత బారిన పడ్డారు. -
వెంకన్న వేడుక చూద్దాం రండి
[ 16-06-2024]
పవిత్ర వైనతేయ నదీ తీరంలో కొలువైన అప్పనపల్లి బాలబాలాజీస్వామివారి ఆలయం ఉత్సవ శోభను సంతరించుకుంది. -
అన్నదాత ఆత్మ సంకల్పానికి దెబ్బ
[ 16-06-2024]
పుడమి తల్లిని నమ్ముకుని ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అడుగడుగునా సమస్యలే. విత్తు వేసింది మొదలు.. దిగుబడి వచ్చే వరకు, ఆ తర్వాత కూడా అనేక సవాళ్లు. -
అక్కడ కూలినా.. ఇక్కడ వేళ్లూనేలా..
[ 16-06-2024]
దశాబ్దాల క్రితం నాటి ఓ రావిచెట్టు కాకినాడ బాలాత్రిపుర సుందరి దేవాలయం రహదారిలో గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. -
పూలబాట పరిచిన పాదాలకు పుష్పాభిషేకం
[ 16-06-2024]
కాకినాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శనివారం ఫాదర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ తండ్రులపై చిన్నారులు పూలు చల్లి ఆశీర్వచనం తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా
-
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
-
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
-
నీతి ఆయోగ్ చెప్పిందదే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు