logo

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

ప్రతి జడ్పీ ఉద్యోగి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు కోరారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం  జిల్లా పరిషత్‌కు చెందిన ఉద్యోగులకు సీఈవో ఎన్‌వీవీ

Published : 13 Aug 2022 03:41 IST

జాతీయ జెండాను అందజేస్తున్న జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు, సీఈవో సత్యనారాయణ తదితరులు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ప్రతి జడ్పీ ఉద్యోగి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు కోరారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం  జిల్లా పరిషత్‌కు చెందిన ఉద్యోగులకు సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణతో కలిసి ఆయన జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు హర్‌ ఘర్‌ తిరంగా పేరుతో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న 125 మంది ఉద్యోగుల ఇళ్లపై జాతీయ జెండా ఎగరాలన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 64 మంది జడ్పీటీసీ సభ్యులకు జెండాలను పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, పాలనాధికారి సుబ్బారావు, పీఆర్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌వీవీ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని