సప్తగోదావరిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతాం
ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరాలయం చెంతనున్న సప్తగోదావరి నదిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పమని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.
ద్రాక్షారామ సప్తగోదావరి నదిలో పూడికతీత పనుల్లో పాల్గొన్న మంత్రి వేణుగోపాలకృష్ణ
ద్రాక్షారామ: ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరాలయం చెంతనున్న సప్తగోదావరి నదిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పమని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. సప్తగోదావరి నదిలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పూడిక తీత పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొంతసేపు కూలీలతోపాటు పలుగుతో మట్టి తవ్వి, గమేళాలకు ఎత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పురావస్తు శాఖ అనుమతితో అనేక అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. భక్తులు శుద్ధమైన నీటిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోనేరును ప్రక్షాళన చేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచి కొత్తపల్లి అరుణ, ఆలయ ఈవో తారకేశ్వరరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!