logo

ప్రజల కష్టాలు తీరేది కూటమితోనే..

బటన్‌లు నొక్కే జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో రెండు బటన్‌లు నొక్కి ఇంటికి సాగనంపాలని వంగవీటి రాధాకృష్ణ అన్నారు.

Published : 30 Apr 2024 06:24 IST

ప్రచార రథంపై మాట్లాడుతున్న వంగవీటి రాధాకృష్ణ, చిత్రంలో మద్దిపాటి వెంకటరాజు, బాపిరాజు, సువర్ణరాజు

దేవరపల్లి, న్యూస్‌టుడే: బటన్‌లు నొక్కే జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో రెండు బటన్‌లు నొక్కి ఇంటికి సాగనంపాలని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేవరపల్లి మండలంలోని బంధపురం, దేవరపల్లి, రామన్నపాలెం, ధుమంతునిగూడెం, కృష్ణంపాలెం, యర్నగూడెం, త్యాజంపూడి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. దేవరపల్లి బస్‌స్టాండ్‌ కూడలిలో రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి అధికారంతోనే రాష్ట్రం అభివృద్ధి చెంది అందరి కష్టాలు తీరుతాయన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ మే 13న ప్రతి ఒక్కరూ ఓటు వేసి భయం నుంచి విముక్తి పొంది, రాక్షస పాలనను అంతమొందించాలన్నారు. జడ్పీ మాజీ ఛైర్మన్‌ బాపిరాజు మాట్లాడుతూ 2014-19 సంవత్సరాల్లో దేవరపల్లి పంచాయతీకి రూ.15 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేశామని, వైకాపా పాలనలో ఎంత అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాలన్నారు. జనసేన ఇన్‌ఛార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌ త్యాగఫలమే ఎన్డీయే కూటమి ఏర్పాటు అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ మార్పును కోరుకుంటున్నారని వెల్లడించారు. ఆండ్రు అనిల్‌, సుంకర దుర్గారావు, గన్నమని హరికృష్ణ, కాట్నం గణేష్‌, గద్దె సుబ్రహ్మణ్యం, ఉప్పులూరి రామారావు, యాగంటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు