కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు ప్రయోజనం
కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రజల్లోకి ఉమ్మడి మేనిఫెస్టో వెళ్లిందని ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు.
తాళ్లపూడి: కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రజల్లోకి ఉమ్మడి మేనిఫెస్టో వెళ్లిందని ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. మండలంలోని గజ్జరంలో ప్రచార కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. అన్నీ కాలనీల్లో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశారన్నారు. యువత, రైతులు, ఉద్యోగులను ఆకట్టుకునేలా పథకాలు ఉన్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో వైకాపా పాలనను తరిమికొడతారన్నారు. చాగల్లు జడ్పీటీసీ మాజీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్య, ఉమ్మడి నాయకులు కాకర్ల వంశీ, మద్దుకూరి వీరవెంకట సత్యనారాయణ, గన్నిన సత్తిబాబు, దండమూడి శేషు, కొర్లపాటి లక్ష్మణరావు, ఓలేటి హరేరామకృష్ణ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్