logo

అన్నీ వర్గాల అండతోనే ఉమ్మడి ప్రభుత్వ విజయం

ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో శుక్రవారం ఉమ్మడి పార్టీల నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు.

Updated : 10 May 2024 19:12 IST

తాళ్లపూడి: ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో శుక్రవారం ఉమ్మడి పార్టీల నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. మండల కేంద్రమైన తాళ్లపూడి, అన్నదేవరపేట, వేగేశ్వరపురం, పెద్దేవం తదితర గ్రామాల్లో ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎంపీ అభ్యర్థిని పురందేశ్వరికి ఓటు వేయాలని సూచిస్తూ ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. అన్నీ వర్గాల అండతోనే ఉమ్మడి ప్రభుత్వం విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా ఓబీసీ మండల అధ్యక్షుడు కలిశెట్టి సన్యాసినాయుడు, తాళ్లపూడి పట్టణ అధ్యక్షుడు అయితం మణికంఠ, జనసేన మండల విభాగం సభ్యులు బండారు నాగకుమారి, నాయకులు గంటా మణికంఠ, గనుపూడి రాజు, కుమార్, జనపల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని