logo

యువకుని దుర్మరణం

యువకుడు దుర్మరణం చెందిన ఘటన ఓడరేవు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నరసరావుపేట సంజీవయ్యనగర్‌ కాలనీకి చెందిన ఇట్టా వెంకటేశ్వర్లు (20) రాడ్‌ బెండింగ్‌

Published : 25 Jan 2022 01:40 IST

నకరికల్లు, న్యూస్‌టుడే: యువకుడు దుర్మరణం చెందిన ఘటన ఓడరేవు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నరసరావుపేట సంజీవయ్యనగర్‌ కాలనీకి చెందిన ఇట్టా వెంకటేశ్వర్లు (20) రాడ్‌ బెండింగ్‌ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. సోమవారం రాత్రి అతను నకరికల్లు వైపు నుంచి నరసరావుపేటకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. దేచవరం మిద్దె సమీపంలో అదుపు తప్పి ముందు వెళ్తున్న దమ్ము ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్తంభించిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాన్ని నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని