logo

సచివాలయాల్లో సర్వీసులు పెంచాలి

గ్రామ, వార్డు సచివాలయాల్లో మరిన్ని సర్వీసులను పెంచాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి అన్నారు. కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో శుక్రవారం గ్రామ, వార్డు సచివాలయాలపై

Published : 21 May 2022 04:26 IST

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: గ్రామ, వార్డు సచివాలయాల్లో మరిన్ని సర్వీసులను పెంచాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి అన్నారు. కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో శుక్రవారం గ్రామ, వార్డు సచివాలయాలపై శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. రెండేళ్లు పూర్తి చేసుకుని, పోలీసు పరిశీలన పూర్తయి, శాఖాపరమైన పరీక్ష పూర్తి చేసి ప్రొబేషన్‌కు అర్హులైన వారి ప్రతిపాదనలను పంపాలని సూచించారు. జూన్‌లో రానున్న పథకాలపై వాలంటీర్లు, అర్హులైన ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాల్లో అసంఘటిత రంగ కార్మికుల వివరాలు సంబంధిత వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఆర్‌.కేశవరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి నున్న వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని