రామాపురంలో మళ్లీ వివాదం
వేటపాలెం మండలం రామాపురంలో మళ్లీ వివాదం రాజుకుంది. ఇరువర్గాల ఘర్షణలో గ్రామస్థులతో పాటు చీరాల గ్రామీణ సీఐ మల్లికార్జునరావు మరో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రామాపురం మత్స్యకార గ్రామం.
గ్రామస్థులతో పాటు చీరాల గ్రామీణ సీఐ, మరో నలుగురు పోలీసులకు గాయాలు
గ్రామస్థులను వారిస్తున్న పోలీసులు
చీరాల అర్బన్, నేరవిభాగం, న్యూస్టుడే: వేటపాలెం మండలం రామాపురంలో మళ్లీ వివాదం రాజుకుంది. ఇరువర్గాల ఘర్షణలో గ్రామస్థులతో పాటు చీరాల గ్రామీణ సీఐ మల్లికార్జునరావు మరో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రామాపురం మత్స్యకార గ్రామం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే గ్రామానికి చెందిన ఒకరు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్థులు అతడ్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన 85 కుటుంబాలు గ్రామం నుంచి వచ్చేసి ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాయి. దీనిపై ఈనెల 20న ఇరువర్గాలను కలిపేందుకు తీరప్రాంత పెద్దలు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో కేసులు పెట్టుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారం రోజులపాటు ఆగ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. తదనంతరం 24న పెద్దల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేసి అందర్నీ కలిపారు.
మాటామాట పెరిగి ఘర్షణ: బుధవారం సాయంత్రం చేతబడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వర్గానికి చెందిన వారికి గ్రామస్థుల మధ్య మాటామాట పెరిగింది. ఈ సమయంలో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడిచేసుకున్నారు. విషయం తెలియడంతో చీరాల గ్రామీణ సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకుని అప్పటికే పికెట్లో ఉన్న సిబ్బంది సాయంతో వివాదాన్ని ఆపడానికి ప్రయత్నించారు. ఇరువర్గాల ఘర్షణలో సీఐతో పాటు నలుగురు హెడ్ కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. 85 కుటుంబాలకు చెందిన కాటంగారి మోహనర్రావు, కనకయ్య, చందు, సీతమ్మ, పండుస్వామితో పాటు మరికొందరికి దెబ్బలు తగలడంతో వీరందరూ చీరాల వైద్యశాలకు చికిత్స కోసం చేరుకున్నారు. ఘటనా స్థలానికి చీరాల డీఎస్పీ ప్రసాదరావు చేరుకుని పరిస్థితిని అదుపు చేయడంతో పాటు గ్రామంలో తిరిగి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న చీరాల వైకాపా నియోజకవర్గ బాధ్యుడు కరణం వెంకటేష్ ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM