logo

సమరానికి సైకిల్‌ యాత్రతో సంసిద్ధం

ఎన్నికల సమరానికి సైకిల్‌ యాత్రతో సంసిద్ధమని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి తెలిపారు. ‘

Published : 29 Apr 2024 06:33 IST

 

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: ఎన్నికల సమరానికి సైకిల్‌ యాత్రతో సంసిద్ధమని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి తెలిపారు. ‘సమరానికి సైకిల్‌ యాత్ర’ పేరుతో తెదేపా, జనసేన, భాజపా నాయకులు గుంటూరు నగరంలో ఆదివారం భారీ సైకిల్‌, బైక్‌ ర్యాలీ నిర్వహించారు. గుజ్జనగుండ్ల సెంటర్‌ వద్ద ర్యాలీని మాధవి ప్రారంభించారు. అక్కడి నుంచి స్తంభాలగరువు, పట్టాభిపురం, కంకరగుంట ఓవర్‌బ్రిడ్జి, హిందూ కళాశాల సెంటర్‌, శంకరవిలాస్‌ ఓవర్‌బ్రిడ్జి, లాడ్జి సెంటర్‌, కొరిటెపాడు, విద్యానగర్‌ మీదుగా మళ్లీ గుజ్జనగుండ్ల సెంటర్‌కు చేరుకొంది. మాధవి మాట్లాడుతూ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ప్రతిఒక్కరూ సైకిల్‌ గుర్తుపై ఓట్లేసి తెదేపా అభ్యర్థుల్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు నిమ్మల శేషయ్య, రావిపాటి సాయికృష్ణ, బిల్డర్‌ పెరవలి వంశీ, అధ్యాపకుడు మద్దినేని సుధాకర్‌, డాక్టర్‌ పోసాని శ్రీనివాసరావు, బండ్లమూడి సుబ్బయ్య, గుంటుపల్లి పవన్‌, వరదయ్య, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని