సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు
ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఎన్నికల్లో ఓటేయాలని కలెక్టర్ రంజిత్బాషా సూచించారు. రేపల్లె మండలం పేటేరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు.
పేటేరులోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి వస్తున్న కలెక్టర్ రంజిత్బాషా, ఆర్వో హెలాషారోన్
రేపల్లె అర్బన్: ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఎన్నికల్లో ఓటేయాలని కలెక్టర్ రంజిత్బాషా సూచించారు. రేపల్లె మండలం పేటేరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పౌరుడు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలిచ్చారు. తొలుత అనగాని భగవంతరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూం, స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరును పరిశీలించారు. రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో హెలాషారోన్, తహసీల్దారు రవీంద్రబాబు, ఎస్సై హరిబాబు, వీఆర్వో సర్దార్ తదితరులు వెంట ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు