logo

దోశలో ఇనుప వాషర్‌ బోల్ట్‌

గుంటూరులోని కొందరు హోటల్స్‌ నిర్వాహకులు ఆహార పదార్థాల తయారీలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గురువారం కొరిటెపాడులోని  ఓ హోటల్‌లో టిఫిన్‌ చేసేందుకు వెళ్లిన వినియోగదారుడికి ఎదురైన సంఘటనే తార్కాణం.

Published : 10 May 2024 05:13 IST

పట్నంబజారు(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరులోని కొందరు హోటల్స్‌ నిర్వాహకులు ఆహార పదార్థాల తయారీలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గురువారం కొరిటెపాడులోని  ఓ హోటల్‌లో టిఫిన్‌ చేసేందుకు వెళ్లిన వినియోగదారుడికి ఎదురైన సంఘటనే తార్కాణం. ఒక వినియోగదారుడు తన స్నేహితులతో కలిసి టిఫిన్‌ చేసేందుకు ఆ హోటల్‌కు వెళ్లారు. ఆర్డర్‌ ఇచ్చిన దోశలో ఇనుప వాషర్‌ బోల్ట్‌ రావడంతో కంగుతిన్నారు. దీంతో విషయాన్ని హోటల్‌ యజమాని దృష్టికి తీసుకువెళ్లారు. వారు ఏమీ పట్టించుకోకపోవడంతో వారి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ఈ విషయాన్ని వినియోగదారులు ఆహార భద్రత నియంత్రణ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయమై జిల్లా అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ నూతలపాటి పూర్ణచంద్రరావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ఈ సంఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. హోటల్‌లో ఆహార పదార్థాలు తనిఖీ   చేసి నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు