logo

Crime News: అమ్మా.. నేనుండలేను!

కంటికి రెప్పలా చూసుకున్న తల్లి దూరంకావడం తట్టుకోలేకపోయిన తనయుడూ తనువు చాలించాడు. ఆమె అంత్యక్రియలు చేసిన శ్మశానవాటికలోనే ఉరేసుకుని ఆత్మహత్య

Updated : 14 Jan 2022 08:32 IST

తల్లి అంత్యక్రియలు నిర్వహించిన శ్మశానవాటికలోనే తనయుడి ఆత్మహత్య


తల్లి లక్ష్మీబాయితో వినోద్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: కంటికి రెప్పలా చూసుకున్న తల్లి దూరంకావడం తట్టుకోలేకపోయిన తనయుడూ తనువు చాలించాడు. ఆమె అంత్యక్రియలు చేసిన శ్మశానవాటికలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ హబీబుల్లాఖాన్‌, ఎస్సై నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గోల్నాక శ్యామ్‌నగర్‌లో నివాసముండే నాగేందర్‌, లక్ష్మీబాయి (60) దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లల చిన్నతనంలోనే నాగేందర్‌ మరణించారు. లక్ష్మిబాయి కూలీ పనులకు వెళ్లి కుమారులు వినోద్‌కుమార్‌(36), విజయ్‌కుమార్‌లను పెంచి పెద్దచేసింది. వినోద్‌కుమార్‌ అవివాహితుడు. ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. క్యాన్సర్‌తో లక్ష్మిబాయి చనిపోగా బుధవారం గోల్నాక హర్రాస్‌పెంట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి ప్రేమను మరచిపోలేని వినోద్‌ అంత్యక్రియల తర్వాత ఇంటికివచ్చి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. శ్మశాన వాటిక షెడ్డులో ఉరేసుకుని చనిపోయిన ఆయనను గురువారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని