రామలింగేశ్వర భూములకు రక్షణేదీ?
దేవాదాయ భూములను కాపాడుతామని ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచడంలేదు. ఇందుకు ఉదాహరణే పూడూరు మండలం దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయ భూములు. పెద్దఉమ్మెంతాల్, పూడూరు తదితర గ్రామాల పరిధిలోని వివిధ సర్వే
అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని వైనం
న్యూస్టుడే, పూడూరు
అటవీశాఖ తీయించిన కందకం
దేవాదాయ భూములను కాపాడుతామని ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచడంలేదు. ఇందుకు ఉదాహరణే పూడూరు మండలం దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయ భూములు. పెద్దఉమ్మెంతాల్, పూడూరు తదితర గ్రామాల పరిధిలోని వివిధ సర్వే నంబర్లలో ఆలయానికి విలువైన భూములు ఉన్నాయి. అప్పట్లో దాతలు స్వామివారి పేరుతో వీటిని అప్పగించారు. ఆలయం ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధీనంలో ఉంది. పూడూరు పంచాయతీ పరిధి సర్వే నంబర్లు 473, 217, 218, 219 లో 44 ఎకరాల 23 గుంటలు ఉండగా, పెద్ద ఉమ్మెంతాల్ పరిధిలో సర్వే నంబర్లు 51, 65లో 23 ఎకరాల 25 గుంటలుంది. భూ దస్త్రాల ప్రక్షాళన అనంతరం అధికారులు ధరణి పోర్టల్లో రామలింగేశ్వర స్వామి భూములను పొందుపర్చక పోవటం అనుమానాలకు తావిస్తోంది.
స్థిరాస్తి వ్యాపారంతో..
స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగటంతో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఎకరానికి రూ.రూ.50 లక్షలనుంచి రూ.3కోట్ల వరకు పలుకుతోంది. వ్యాపారులు వీటిపై కన్నేస్తే ఆ భూములు కనుమరుగయ్యేందుకు ఆస్కారం ఏర్పడనుంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటంతో పాటు హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి కలిగి ఉండటంతో పూడూరు మండలం ప్రాధాన్యత సంచరించుకుంది. ఎంతో మంది సంపన్నుల కుటుంబాలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన వారు ఈ ప్రాంతంలో భూములను కొనుగోలు చేసుకుని వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. నగరానికి దగ్గరగా ఉండటంతో అందరి కళ్లు పూడూరు మండలం పైనే ఉన్నాయి.
కంచె ఏర్పాటు చేస్తాం అనుమతులు ఇవ్వండి
దేవాలయానికి చెందిన భూములను కాపాడుకునేందుకు పాలకవర్గం ముందుకు వచ్చింది. రామలింగేశ్వర స్వామి ఛైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పాలకవర్గం ఇటీవల దేవాదయశాఖ కమిషనర్, జిల్లా అధికారులకు వేర్వేరుగా లేఖ రాశారు. భూములకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి పట్టా పాసుపుస్తకాలు రెవెన్యూ శాఖ నుంచి సమకూర్చుకుని కమిటీకి అందజేయాలని కోరారు.
హద్దులు గుర్తించకుండానే..
పూడూరు సర్వే నంబరు 473లోని 12.4 ఎకరాలు దేవాదాయశాఖ రికార్డుల్లో మాత్రమే ఉంది. రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు ఆన్లైన్లో నమోదు చేయలేదు. కనీసం హద్దులు కూడా గుర్తించలేదు. సర్వే చేయకపోవటంతో ఎక్కడ ఎంత విస్తీర్ణంలో భూములు ఉన్నాయనేది సందిగ్ధత నెలకొంది. పక్కనే అటవీ ప్రాంతం కావడంతో, ఆలయ భూములు అందులో కలిసిపోయాయి. హద్దులు గుర్తించకుండానే ఇటీవల అటవీశాఖ అధికారులు చుట్టూ లోతైన కందకాలు తీయిస్తున్నారు. ఆలయం దేవాదాయశాఖ పరిధిలో ఉన్నప్పటికి అటవీశాఖ అధికారులు మాత్రం మొత్తం స్థలం మాదే అంటూ ఆక్రమణకు చూస్తున్నారు. గుడివద్ద ఎటువంటి పనులు చేపట్టినా అటవీశాఖ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. పలుమార్లు స్థానికులు, భక్తులు వ్యతిరేకించడంతో మిన్నకుంటున్నా, సమస్య పరిష్కారం కావటం లేదు. పెద్దఉమ్మెంతాల్ సర్వేనంబరు 51,65 ోని 23.25 ఎకరాల భూమి ధరణి వచ్చాక అదే గ్రామానికి చెందిన ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల పేర్లతో నమోదయి ఉంది.
సమస్య పరిష్కారానికి కృషి
కిరణ్కుమార్, తహసీల్దారు, పూడూరు
అప్పట్లో పనిచేసిన కొందరు సిబ్బంది చేసిన తప్పిదంతో భూముల వివరాలు తప్పుగా నమోదయ్యాయి. కొన్ని ఆన్లైన్ కాలేదు. ఇటీవల దామగుండం భూముల ఆన్లైన్ కోరుతూ కమిటీ వారు వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు దస్త్రాలు పరిశీలిస్తున్నాం. ఇక్కడున్న ఆధారాలతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమో నినాదం.. కమల వికాసం
[ 11-05-2024]
వికసిత కమలాలతో.. కాషాయ రెపరెపలతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కళకళలాడాయి. మైదానమంతా మోదీ నినాదమే మార్మోగింది. -
అడుగడుగునా హారతులు.. అభివృద్ధికి వరాలు
[ 11-05-2024]
అడుగడుగునా హారతులు.. బతుకమ్మ ఆటలు.. శ్రేణుల నినాదాలు.. వెరసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోడ్షోలో ఎటుచూసినా జనసందోహమే. -
భద్రత మాది.. బాద్యత మీది
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 100 శాతం భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా భరోసా కల్పిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. -
సికింద్రాబాద్ ఓటర్లు అభివృద్ధి చూశారు
[ 11-05-2024]
‘రాష్ట్ర రాజధానిలో సగం సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక్కడ నేను చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారు. -
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. జాతీయ హోదాకు పోరాడతా
[ 11-05-2024]
‘చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఓవైపు ఆధునికతను పుణికి పుచ్చుకోవడంతోపాటు మరోవైపు వెనకబడిన ప్రాంతాల సమాహారంగా విస్తరించి ఉంది. -
ప్రలోభాలకు ఎర.. పంపకాల జాతర
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో రెండు రోజులే గడువు ఉండటంతో రాజధాని పరిధిలో ప్రలోభాలకు తెర లేచింది. -
కమలం గుర్తుంచుకోండి
[ 11-05-2024]
శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి రోడ్షో నిర్వహించారు. -
తెలంగాణ గుండెచప్పుడు.. ప్రతిధ్వనించింది
[ 11-05-2024]
ఇప్పటి వరకు లోక్సభకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా ‘తెలంగాణ ప్రజా సమితి’ (టీపీఎస్) చారిత్రక విజయం నమోదు చేసుకుంది. -
భాజపా శ్రేణుల్లో నయా జోష్
[ 11-05-2024]
సార్వత్రిక ప్రచారం తుది దశలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీ హైదరాబాద్, నారాయణపేట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. -
పాలమూరు ఆత్మగౌరవ ఎన్నికలివి
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి మధ్యనో, మూడు పార్టీల మధ్యనో జరుగుతున్నవి కాదని.. పాలమూరు ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత 70 ఏళ్ల వెనకబాటుతనానికి, వలస పోతున్న వారి కోసం జరుగుతున్నవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అధోగతి: సబిత
[ 11-05-2024]
ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. -
చేవెళ్ల సీటు సోనియాకు కానుకగా ఇస్తాం: టీఆర్ఆర్
[ 11-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ సీటును గెలిపించుకుని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కో ఇంఛార్జి డాక్టర్ టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. -
ప్రచార పర్వం.. నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
దాదాపు నెల రోజులుగా హోరెత్తించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో తెర పడుతోంది. -
సొంతవారికే పంపకాల అప్పగింతలు
[ 11-05-2024]
ప్రచారం తుది అంకానికి చేరుకోవడంతో అభ్యర్థులకు ‘పంపకాల’ తలనొప్పులు మొదలయ్యాయి. -
ప్రయాణం మానుకోండి.. ప్రతిఫలం పొందండి
[ 11-05-2024]
ఏపీ నుంచి వచ్చి శేరిలింగంపల్లిలో ఉంటున్న కొందరు ఓటర్లు సొంతూరుకు ప్రయాణమయ్యారు. -
గత స్మృతులను గుర్తు చేస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తూ
[ 11-05-2024]
ఆరు నెలల క్రితం చిన్నారి పాడిన పద్యాన్ని గుర్తు చేసుకొని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. -
ప్రముఖుల రాకపోకలతో బేగంపేట విమానాశ్రయంలో సందడి
[ 11-05-2024]
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నగరానికి ప్రముఖుల రాకపోకలతో శుక్రవారం బేగంపేట విమానాశ్రయం సందడిగా మారింది. -
ఎన్నికల రోజున డ్రోన్లతో నిఘా
[ 11-05-2024]
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ తెలిపారు. -
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం
[ 11-05-2024]
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకమని నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
చీటీ వచ్చిందా.. ఏ బ్రాండు కావాలో ఇచ్చెయ్
[ 11-05-2024]
ఓటర్లకు మద్యం పంపిణీపై ఎన్నికల సంఘం దృష్టి మళ్లించేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. -
దుర్గంచెరువు పూడ్చివేతపై ఫిర్యాదు
[ 11-05-2024]
మాదాపూర్లోని దుర్గంచెరువు ఎఫ్టీఎల్ను ఫూడ్చివేసిన ప్రాంత్రాన్ని శుక్రవారం ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. -
జనం డబ్బుతో సినిమా నిర్మాణం
[ 11-05-2024]
చిట్టీల వ్యాపారంతో ప్రజల వద్ద రూ.కోట్లు వసూలు చేసిన దంపతులు ఆ సొమ్ముతో ఓ సినిమాను నిర్మించారు. -
గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
[ 11-05-2024]
కేపీహెచ్బీ ఠాణా పరిధిలో నాలుగు రోజుల క్రితం మహిళ మెడలోంచి గొలుసు చోరీ చేసిన ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి నిందితుడని గుర్తించిన పోలీసులు.. -
ఈత కొలనులో మునిగి అయిదేళ్ల చిన్నారి దుర్మరణం
[ 11-05-2024]
వేసవి శిబిరం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు