logo

తల్లి కళ్ల ముందే తనయ దుర్మరణం

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. అతివేగం, నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన లారీ చక్రాల కిందపడి చిన్నారి నలిగిపోయింది. తల్లి కళ్ల ముందే జరిగిన ఈ దుర్ఘటన సైదాబాద్‌ ఠాణా పరిధిలో సోమవారం సాయంత్రం

Published : 24 May 2022 07:34 IST

పవనశ్రీ

సైదాబాద్‌, న్యూస్‌టుడే: లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. అతివేగం, నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన లారీ చక్రాల కిందపడి చిన్నారి నలిగిపోయింది. తల్లి కళ్ల ముందే జరిగిన ఈ దుర్ఘటన సైదాబాద్‌ ఠాణా పరిధిలో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఐఎస్‌సదన్‌ డివిజన్‌ ఖాజాబాగ్‌ గుడిసెలబస్తీలో రమావత్‌ రవి, మధుమతి దంపతులు నివసిస్తున్నారు. రవి ఆటోడ్రైవర్‌. వీరికి కుమార్తె పవనశ్రీ(3), కుమారుడు(1) ఉన్నారు. వీరి ఇంటి సమీపంలోని ఓ వ్యక్తి భవనం నిర్మిస్తున్నాడు. సోమవారం సాయంత్రం సిమెంటు లోడుతో లారీ వచ్చింది. లోడ్‌ దింపి న డ్రైవరీ లారీని అతివేగంగా వెనక్కు తీస్తుండగా.. అప్పుడే ఇంట్లో నుంచి వచ్చిన పవనశ్రీని ఢీకొట్టింది. చిన్నారి కిందపడడంతో తల్లి కేకలు వేసింది. అప్పటికే లారీ ముందు టైరు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. డ్రైవర్‌ పరారయ్యాడు. లారీని సీజ్‌ చేసి ఠాణాకు తరలించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ సుబ్బరామిరెడ్డి తెలిపారు. డ్రైవర్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని