logo

మహా తేజస్సు.. దేశానికి ఉషస్సు

తెలుగుదేశం శ్రేణులు ఎన్నాళ్లో వేచిన ‘మహో’దయం రానే వచ్చింది. ‘తెలుగు’ తేజం దేదీప్యమానంగా ప్రభవించింది. ఈ ఘట్టాన్ని చూసి ఒంగోలు మండువ వారిపాలెం మురిసింది. శుక్రవారం ప్రాతఃకాల వేళే యువ శక్తి ఉరకలెత్తగా..

Updated : 28 May 2022 05:04 IST

తెలుగుదేశం శ్రేణులు ఎన్నాళ్లో వేచిన ‘మహో’దయం రానే వచ్చింది. ‘తెలుగు’ తేజం దేదీప్యమానంగా ప్రభవించింది. ఈ ఘట్టాన్ని చూసి ఒంగోలు మండువ వారిపాలెం మురిసింది. శుక్రవారం ప్రాతఃకాల వేళే యువ శక్తి ఉరకలెత్తగా.. మహిళా శక్తీ అదే బాటలో వడివడిగా అడుగులేసింది. నేతల ప్రసంగాలు శ్రేణుల్ని కార్యోన్ముఖుల్ని చేస్తూ కొత్త ఉత్సాహం నింపాయి. ఆంధ్రుల హోరుకు.. తెలంగాణ తమ్ముళ్ల జోరు తోడైందని, తెదేపా మహానాడులో ప్రతినిధుల సభే ఇలా పరవళ్లు తొక్కితే.. బహిరంగ సభ ఇక ఓ ప్రభంజనమే అవుతుందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మహానాడు వేదికపై తెదేపా అధినేత చంద్రబాబు, తెలంగాణ అధ్యక్షుడు నరసింహులు


వైకల్యాన్నీ లెక్క చేయకుండా..

మహబూబాబాద్‌ నియోజకవర్గానికి చెందిన దివ్యాంగుడు సోమనర్సయ్య మహానాడుకు హాజరయ్యారు. 1982 నుంచి తెదేపాలో ఉన్నానని.. ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లా తెదేపా పార్లమెంట్‌ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నానని చెప్పారు.


సారూ ! మహానాడే.. మా కానుక


చంద్రబాబుతో ప్రకాశం జిల్లా నేతలు


భలే ఊపు.. భవిత వైపు చూపు


వేదిక వద్ద తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, యనమల, పయ్యావుల, దేవినేని, లోకేష్‌, అశోక్‌ గజపతి, కనకమేడల, అనిత


ప్రసంగిస్తున్న రావుల చంద్రశేఖర్‌రెడ్డి


మీరే నిర్మాతలు.. మారుస్తారా తలరాతలు


ప్రాంగణానికి కదం తొక్కుతున్న తెదేపా మహిళా నాయకులు, అభిమానులు


హుజూర్‌నగర్‌ నియోజకవర్గం గరిడేపల్లి మండలం నుంచి 20 మంది తెదేపా నాయకులు హాజరయ్యారు.
వీరిలో మండవ వెంకటేశ్వర్లు ఇప్పటికి 15 మహానాడు సభలకు వచ్చినట్లు తెలిపారు.

- ఈనాడు, ఒంగోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని