logo

Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు

బంజారాహిల్స్‌లో ఉంటున్న తండ్రీ కుమారులు సునీల్‌ అహుజా, ఆశిష్‌ అహుజాల నుంచి ఇద్దరు నిందితులు శివశంకర్‌, కోమల్‌ ప్రసాద్‌లు రూ.16.10 కోట్లు కాజేశారు.

Updated : 07 Aug 2022 09:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో ఉంటున్న తండ్రీ కుమారులు సునీల్‌ అహుజా, ఆశిష్‌ అహుజాల నుంచి ఇద్దరు నిందితులు శివశంకర్‌, కోమల్‌ ప్రసాద్‌లు రూ.16.10 కోట్లు కాజేశారు. సునీల్‌, ఆశిష్‌ వేర్వేరుగా ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదు చేసిన సీసీఎస్‌ పోలీసులు.. నిందితుల పేర్లు చూసి అవాక్కయ్యారు. శివశంకర్‌, కోమల్‌ప్రసాద్‌ కూడా తండ్రీకొడుకులేనని తెలుసుకున్నారు. షేక్‌పేటలో తనకు స్థలం ఉందని శివశంకర్‌ రెండేళ్ల క్రితం సునీల్‌కు చెప్పాడు. వాణిజ్య భవనం నిర్మించి 8వేల చదరపు అడుగుల ఏరియా ఇస్తానని నమ్మించి 2020లో రూ.6.5 కోట్లు తీసుకున్నాడు. శివశంకర్‌ కుమారుడు కోమల్‌ ప్రసాద్‌.. సునీల్‌ కుమారుడు అశిష్‌ను కలిసి కొండాపూర్‌లోని ఓ వాణిజ్య సముదాయంలో మూడో అంతస్తు మొత్తం నీకే ఇస్తానంటూ రూ.9.6 కోట్లు తీసుకున్నాడు. డబ్బు కోసం నిలదీయగా ఇద్దరూ చేతులెత్తేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని