Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
బంజారాహిల్స్లో ఉంటున్న తండ్రీ కుమారులు సునీల్ అహుజా, ఆశిష్ అహుజాల నుంచి ఇద్దరు నిందితులు శివశంకర్, కోమల్ ప్రసాద్లు రూ.16.10 కోట్లు కాజేశారు.
ఈనాడు, హైదరాబాద్: బంజారాహిల్స్లో ఉంటున్న తండ్రీ కుమారులు సునీల్ అహుజా, ఆశిష్ అహుజాల నుంచి ఇద్దరు నిందితులు శివశంకర్, కోమల్ ప్రసాద్లు రూ.16.10 కోట్లు కాజేశారు. సునీల్, ఆశిష్ వేర్వేరుగా ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు.. నిందితుల పేర్లు చూసి అవాక్కయ్యారు. శివశంకర్, కోమల్ప్రసాద్ కూడా తండ్రీకొడుకులేనని తెలుసుకున్నారు. షేక్పేటలో తనకు స్థలం ఉందని శివశంకర్ రెండేళ్ల క్రితం సునీల్కు చెప్పాడు. వాణిజ్య భవనం నిర్మించి 8వేల చదరపు అడుగుల ఏరియా ఇస్తానని నమ్మించి 2020లో రూ.6.5 కోట్లు తీసుకున్నాడు. శివశంకర్ కుమారుడు కోమల్ ప్రసాద్.. సునీల్ కుమారుడు అశిష్ను కలిసి కొండాపూర్లోని ఓ వాణిజ్య సముదాయంలో మూడో అంతస్తు మొత్తం నీకే ఇస్తానంటూ రూ.9.6 కోట్లు తీసుకున్నాడు. డబ్బు కోసం నిలదీయగా ఇద్దరూ చేతులెత్తేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్