వ్యాపారులకు ‘పోలీస్ లైసెన్సు’
ఏదైనా వ్యాపారం చేయాలంటే గతంలో జీహెచ్ఎంసీ నుంచి ‘ట్రేడ్ లైసెన్సు’, ఫుడ్ లైసెన్సు, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీతో పాటు పోలీసు లైసెన్సు తీసుకోవాల్సి ఉండేది.
తొమ్మిదేళ్ల తర్వాత పునరుద్ధరణ
నారాయణగూడ, న్యూస్టుడే: ఏదైనా వ్యాపారం చేయాలంటే గతంలో జీహెచ్ఎంసీ నుంచి ‘ట్రేడ్ లైసెన్సు’, ఫుడ్ లైసెన్సు, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీతో పాటు పోలీసు లైసెన్సు తీసుకోవాల్సి ఉండేది. సాంకేతిక కారణాల వల్ల 2014 తర్వాత పోలీసు లైసెన్సు రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత పోలీసు లైసెన్సు నిబంధన తెరపైకొచ్చింది. ఇప్పటికే నగరంలోని ఆయా ఠాణాల పరిధిలోని పెద్దా చిన్నా వ్యాపార సముదాయాలు, హోటళ్లు, బేకరీల నిర్వాహకులను పోలీసులు కలుస్తూ.. పోలీసు లైసెన్సు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.
ఎవరు తీసుకోవాలంటే.. : స్టార్ హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్, పబ్లు, కాఫీ షాప్, టీ స్టాల్, కెఫే, బేకరీ రెస్టారెంట్, ఐస్ క్రీమ్ పార్లర్, స్వీట్ షాప్, జ్యూస్ సెంటర్, సినిమా థియేటర్ క్యాంటిన్, డ్రైవ్ ఇన్ రెస్టారెంట్, హోటళ్లు, దాబాలు, సినిమాటోగ్రఫీ, ఎక్స్ప్లోజివ్, ఫైర్ క్రాకర్స్, పెట్రోలియం ఉత్పత్తులు విక్రయించేవారు ఈ లైసెన్సు తీసుకోవాలి.
ఆన్లైన్లో దరఖాస్తులు.. : ఏటా ఏప్రిల్ 1 నుంచి తదుపరి ఏడాది మార్చి 31 వరకు గడువుతో లైసెన్సులు జారీ చేస్తామని నారాయణగూడ ఇన్స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. దీనికి వ్యాపార స్థాయిని బట్టి రూ.1000 నుంచి రూ.15000 వరకు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారులు hyderabadpolice.gov.in వెబ్సైట్ను తెరిచి అప్పటికే ఉన్న జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్సు, అద్దె, ఇతర ఒప్పంద పత్రాలను జత చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వారం, పది రోజుల్లో లైసెన్సు ఆన్లైన్ ద్వారా జారీ అవుతుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ఆలోపు లైసెన్సు పొందకపోతే చట్ట పరమైన చర్యలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.
వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి..
ఈ లైసెన్సు విధానం ద్వారా నగరంలోని ఆయా ఠాణాల పరిధిలో వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ఇతర వ్యాపారాలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. వ్యాపారుల ఫోన్ నంబరు, ఇతర వివరాలు సేకరించి వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందజేసే విధంగా ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
అక్కడికి రాలేం.. మీరే రండి
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.