Hyderabad Metro Rail: చివరి ట్రిప్పులు..జనం తిప్పలు
మెట్రోరైలులో రాత్రి చివరి ట్రిప్పుల్లో తిరిగే ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. పలు స్టేషన్లలో ప్రవేశ మార్గాలను రాత్రిపూట ముందుగానే మూసేయడమే ఇందుకు కారణం. స్టేషన్కు ఇరువైపులా లిఫ్టులు, మెట్ల దారులున్నా ఒకవైపు మూసేస్తున్నారు.
మెట్రో స్టేషన్లలో రాత్రి 11కే ప్రవేశ మార్గాలు బంద్
‘ఈనాడు’ పరిశీలనలో తేటతెల్లం
యూసుఫ్గూడలో శనివారం రాత్రి ముందే మూసేసిన మార్గం
ఈనాడు, హైదరాబాద్: మెట్రోరైలులో రాత్రి చివరి ట్రిప్పుల్లో తిరిగే ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. పలు స్టేషన్లలో ప్రవేశ మార్గాలను రాత్రిపూట ముందుగానే మూసేయడమే ఇందుకు కారణం. స్టేషన్కు ఇరువైపులా లిఫ్టులు, మెట్ల దారులున్నా ఒకవైపు మూసేస్తున్నారు. దీంతో తరచూ సిబ్బందికి, ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. నిత్యం ఉదయం 6 నుంచి మొదలై టర్మినల్ స్టేషన్లు అయిన ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం, జేబీఎస్ స్టేషన్లకు ఆఖరి మెట్రో 12 గంటల ప్రాంతంలో చేరుకుంటుంది. అప్పటివరకు స్టేషన్ల అన్ని ద్వారాలు తెరిచే ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
దిగేటప్పుడు ఇబ్బందులే.. నాలుగువైపుల ప్రయాణికులు వెళ్లేలా ఎంట్రీ, ఎగ్జిట్పాయింట్లు కొన్ని స్టేషన్లలో మినహా అన్నిస్టేషన్లలో ఉన్నాయి. రాత్రిపూట వెళితే అక్కడ ద్వారం మూసి ఉంటుంది. కనీసం ప్రయాణికులను చూసి స్టేషన్ సిబ్బంది తెరిచే ప్రయత్నం చేయడం లేదు. దీంతో గొడవలు జరుగుతున్నాయి. యువతకు పర్లేదు. వృద్ధులు, పిల్లలతో వచ్చే కుటుంబ సభ్యులు, సామాన్లతో వచ్చేవారి పరిస్థితి వర్ణనాతీతం. ఏమైనా అభ్యంతరాలుంటే కాల్సెంటర్కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు తప్ప ద్వారాలు తెరవడం లేదని వాపోయారు. శనివారం యూసుఫ్గూడ స్టేషన్లో రాత్రి 10.45 గంటలకే ప్రవేశ మార్గం మూసేశారు.
సైబర్టవర్స్ మెట్రో స్టేషన్ది మరో విడ్డూరం..
సైబర్టవర్స్.. అదే హైటెక్సిటీ మెట్రోస్టేషన్కు ఆనుకుని ఈ-గలేరియా మాల్ ఉంది. ఇందులో వాహనదారుల పార్కింగ్కు సౌకర్యం ఉంది. ఇందులో వాహనాలను నిలిపి మెట్రోలో ప్రయాణిస్తారు. మెట్రో మాల్ నుంచే మెట్రోస్టేషన్కు నేరుగా దారి ఉంటుంది. ఇది రాత్రి 10 గంటల తర్వాత బంద్ అయిపోతుంది. అప్పుడు మెట్రోస్టేషన్లో కిందకు దిగి, రోడ్డు దాటి మాల్లోని సెల్లారుకు నడుచుకుంటూ వెళ్లి వాహనాలను తీసుకెళ్లాల్సి వస్తోంది.
రాయదుర్గంలో భారీ వరుసలు
కారిడార్-3లోని చివరి స్టేషన్ రాయదుర్గంలో ప్రయాణికుల కష్టాలు మరోలా ఉన్నాయి. ఇక్కడ కార్యాలయాలు వదిలిన వేళ ఐటీ ఉద్యోగులు ఒక్కసారిగా పెద్దఎత్తున వస్తున్నారు. ఇక్కడ ఒకవైపు నుంచే మెట్రోస్టేషన్లోకి వెళ్లే మార్గం ఉంది. దీంతో స్టేషన్ బయటివరకు ప్రయాణికులు బారులు తీరుతున్నారు. లోపలికి వెళ్లేందుకు, టికెట్ల కోసం పాట్లు పడుతున్నారు. ఇక్కడ లెమన్ట్రీ వైపు రెండో ప్రవేశమార్గం సిద్ధం అవుతోంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికుల ఇబ్బందులు తప్పుతాయని మెట్రో వర్గాలు అంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!