logo

కాపురానికి రావడం లేదని భార్యపై కత్తితో దాడి

కాపురానికి రావడం లేదంటూ భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. బాధితురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఎస్సార్‌నగర్‌ ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 27 Mar 2023 01:33 IST

అమీర్‌పేట, న్యూస్‌టుడే: కాపురానికి రావడం లేదంటూ భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. బాధితురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఎస్సార్‌నగర్‌ ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన నమిత(29)కు గుంటూరుకు చెందిన నాగేశ్వర్‌రావు(35)తో 11ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. దంపతుల మధ్య మనస్పర్థలతో గతేడాది విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. నమిత ఇద్దరు పిల్లలతో కలిసి బోరబండలో అద్దెకుంటుంది. నాగేశ్వర్‌రావు ఎల్బీనగర్‌లో మిత్రుడితో కలిసి ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య కాపురానికి రావడం లేదనే కోపంతో ఆదివారం ఉదయం నాగేశ్వర్‌రావు బోరబండకు వచ్చాడు. నమితతో గొడవ పడుతూ కూరగాయల కత్తితో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో నాగేశ్వర్‌రావును పట్టుకునేందుకు నమిత ప్రయత్నిస్తూ వెంబడించింది. రోడ్డుపైకి వచ్చి కుప్పకూలిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి గాంధీకి తరలించారు.  ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నాగేశ్వర్‌రావు కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని