logo

పదేళ్ల పండగ వందేళ్లు గుర్తుండేలా...

ప్రత్యేక రాష్ట్ర నినాదం.. అమరుల త్యాగం.. ఉద్యమ ఫలం.. వెరసి తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. పదేళ్ల పాలనలోకి అడుగిడుతున్న తరుణంలో శుక్రవారం ప్రారంభమైన దశాబ్ది సంబరాలు అంబరాన్నంటాయి.

Published : 03 Jun 2023 03:43 IST

రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగా హైకోర్టులో పేరిణి నృత్యాన్ని ప్రదర్శిస్తున్న కళాకారులు. అంతర్‌చిత్రంలో నృత్య బృందం నాయకుడిని సన్మానిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు

 

తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసి వందనం చేస్తున్న ఎంపీ కేశవరావు,  దాసోజు శ్రవణ్‌ తదితరులు

రంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద ప్రొ.జయశంకర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి సబితారెడ్డి, జడ్పీఛైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

గోల్కొండ కోట వద్ద జానపద కళాకారుల సందడి

కోటలో ఛాయా చిత్రప్రదర్శనను తిలకిస్తున్న విద్యార్థులు

రవీంద్రభారతిలో నినాదాలు చేస్తున్న  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మామిడి   హరికృష్ణ, జూలూరు గౌరీశంకర్‌ తదితరులు

అమరవీరుల స్తూపానికి శ్రద్ధాంజలి ఘటించి నమస్కరిస్తున్న హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ

రాజ్‌భవన్‌లో జరిగిన ఉత్సవాల్లో  కళాకారిణులతో కలిసి నృత్యం చేస్తున్న గవర్నర్‌ తమిళిసై

అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి

గోల్కొండ కోట వద్ద కిషన్‌రెడ్డితో సెల్ఫీ దిగుతున్న నృత్య కళాకారిణులు

ప్రత్యేక రాష్ట్ర నినాదం.. అమరుల త్యాగం.. ఉద్యమ ఫలం.. వెరసి తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. పదేళ్ల పాలనలోకి అడుగిడుతున్న తరుణంలో శుక్రవారం ప్రారంభమైన దశాబ్ది సంబరాలు అంబరాన్నంటాయి. నగరంలోని సచివాలయం, గోల్కొండ కోట వద్ద పెద్దఎత్తున వేడుకలు నిర్వహించారు. ఎండ మండుతున్నా.. పదేళ్ల   పండగను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. 

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని