కరెంటు బిల్లు ఎక్కువ వస్తోందా? ఇలా చేయండి మరి!
ఇంట్లో పెద్దగా గృహోపకరణాలు కూడా లేవు. అయినా కరెంట్ వినియోగం మాత్రం అధికంగా ఉంటోంది. 200 యూనిట్లకు అటు ఇటుగా ఉండాల్సిన వినియోగం కాస్త 350 యూనిట్లుగా చూపుతోంది.
లైసెన్స్డ్ ఎలక్ట్రీషియన్తో తనిఖీ చేయించుకోవాలని సూచిస్తున్న విద్యుత్తు అధికారులు
ఈనాడు, హైదరాబాద్
ఇంట్లో పెద్దగా గృహోపకరణాలు కూడా లేవు. అయినా కరెంట్ వినియోగం మాత్రం అధికంగా ఉంటోంది. 200 యూనిట్లకు అటు ఇటుగా ఉండాల్సిన వినియోగం కాస్త 350 యూనిట్లుగా చూపుతోంది. ఎండాకాలంలోనే కాదు చలికాలంలోనూ ఇదే తీరు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటగా ఎవరికైనా మీటర్ మీదనే సందేహం వస్తుంది. విద్యుత్తు సంస్థకు నిర్ణీత రుసుం చెల్లించి మీటర్ను తనిఖీ చేయిస్తే లోపాలుంటే పాత మీటర్ స్థానంలో కొత్తవి బిగిస్తారు. మరి మీటర్ బాగానే ఉందని టెస్టింగ్లో తేలితే? మీటర్లలో లోపాలే కాదు.. ఇంట్లో వాడే గృహోపకరణాలు ఎప్పటివి? ఎర్తింగ్, కరెంట్ సరఫరా వ్యవస్థలోని లోపాలు కూడా కారణం అవుతుంటాయని ఇంజినీర్లు చెబుతున్నారు. వైరింగ్లో లోపాలు ఉన్నప్పుడు అసలు వినియోగించకుండా కరెంట్ వృథాగా పోయే అవకాశం ఉందని బిల్లు పెరగడానికి అది ఓ కారణంగా చెబుతున్నారు.
పాత వాటితోనే మోత..
* ప్రతి నెలా ఎక్కువ యూనిట్లు కాలుస్తున్నట్లు బిల్లులో చూస్తే వాస్తవంగా అంత వినియోగిస్తున్నామా? లేదా బేరీజు వేసుకోవాలి. బిల్లులో రికార్డెడ్ మాగ్జిమమ్ డిమాండ్ (ఆర్ఎండీ)ను పరిశీలిస్తే ఎంత వాడుతున్నారో తెలుస్తుంది.
* ఇంట్లో ఉన్న ఉపకరణాలు, వాటికి వినియోగానికి అయ్యే కరెంట్ ఎంత? అనేది అవగాహన ఉంటే బిల్లు చూడగానే ఎక్కువ వచ్చిందా? తక్కువ వచ్చిందా అనేది తెలిసిపోతుంది.
* ఉపకరణాలు తక్కువగా ఉన్నా ఎక్కువ బిల్లు వస్తుందంటే.. గృహోపకరణాలను ఎంతకాలం నుంచి వాడుతున్నారనేది పరిశీలించాలి. రిఫ్రిజిరేటర్లు పాతవి కావడంతో విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. నెలంతా 50 యూనిట్లతో పనిచేయాల్సిన రిఫ్రిజిరేటర్లు 150దాకా కాలుస్తుంటాయి. వీటి స్థానంలో కొత్తవి కొనడం మేలు. విద్యుత్తు ఆదా చేసే స్టార్ రేటింగ్వి తీసుకోవాలి.
* సరైన నాణ్యతా ప్రమాణాలు లేని ఫ్యాన్లు, గీజర్లు, ఇతర గృహోపకరణాల వాడకంతోనూ మీటర్ గిరాగిరా తిరుగుతుంది. వీటి స్థానంలో నాణ్యమైనవి ఏర్పాటు చేసుకోవాలి.
లీకేజీలు అరికడితే..
* ఇంట్లో అన్ని ఉపకరణాలు కొత్తవే. పైగా నాణ్యత ప్రమాణాలు కలిగినవే.. అయినా ఎక్కువ కరెంట్ ఎందుకు కాలుతుందో అర్థం కావడం లేదంటారా? ఇంట్లో కరెంట్ లీకేజీ కారణంగా కూడా వినియోగం పెరుగుతుందని.. ఇవన్నీ మీటర్లో రికార్డు అవుతుంటాయని విద్యుత్తు ఇంజినీర్లు చెబుతున్నారు.
* మొదట ఇంట్లోకి కరెంట్ సరఫరా అయ్యే మెయిన్బ్రేకర్ ఆపేయాలి. దీంతో మీటర్ ఆగిపోతుంది. అప్పటికీ మీటర్ తిరుగుతుందంటే లీకేజీ ఉన్నట్లు. ఎలక్ట్రీషియన్ను సంప్రదిస్తే లీకేజీ కరెంట్ క్లాంప్ మీటర్తో లోపాన్ని గుర్తిస్తాడు. దాన్ని సరిచేసుకుంటే సరిపోతుంది. ్య మీటర్ దగ్గర్నుంచి ఎర్త్ పాయింట్ వరకు.. స్విచ్బోర్డులు, సాకెట్ల దాకా లైసెన్స్డ్ ఎలక్ట్రీషియన్తో తనిఖీ చేయించాలి. ప్రతి పాయింట్ పరిశీలిస్తే ఎక్కడ నుంచి కరెంట్ లీక్ అవుతుందో తెలుస్తుంది.
* ఇళ్లలో తప్పుడు వైరింగ్ కారణంగానే బిల్లులు మారిపోతుంటాయి. ఒక ఫ్లాట్ తీగను మరో ఫ్లాట్ మీటర్లో కలపడం, కామన్ మోటారును ఎవరో ఒక పోర్షన్లో ఉండే వారికి కలపడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి సరి చేసుకుంటే వాస్తవిక బిల్లునే చేతికొస్తుంది.
లైసెన్స్డ్ ఎలక్ట్రీషియన్ అంటే..
చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ (సీఈఐజీ), ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు ద్వారా వైర్మెన్ పర్మిట్ గానీ సూపర్వైజర్ పర్మిట్గానీ ఉన్నవారు. ఇలాంటి వారు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో గంజాయి, ఎంఎండీఏ స్వాధీనం
[ 17-05-2024]
కూకట్పల్లి ఠాణా పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. -
కుండపోత.. జనం ఎదురీత
[ 17-05-2024]
రాజధానిలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో నగరం అతలా కుతలమైంది. -
కట్టుకున్నోడిని చంపేసి.. గుండెపోటని నమ్మించి
[ 17-05-2024]
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది. -
మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు
[ 17-05-2024]
మల్కాజిగిరి భాజపా కార్పొరేటర్ శ్రవణ్కుమార్ సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
యాసిడ్ కలిపిన నీటితో స్నానం.. విద్యార్థినికి గాయాలు
[ 17-05-2024]
యాసిడ్ కలిపిన బకెట్ను స్నానం నీటికి ఉపయోగించడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. -
నిధులు మింగేసి.. నాలాలను వదిలేసి
[ 17-05-2024]
రూ.వెయ్యి కోట్లతో నాలాల ఆధునికీకరిస్తామంటూ మూడేళ్ల క్రితం చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ)పై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. -
వందేభారత్ 5 గంటలు ఆలస్యం
[ 17-05-2024]
టైమంటే వందేభారత్.. వందేభారత్ అంటే టైం..అని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ద.మ.రైల్వే వాటి సమాయాలపై సంశయం వచ్చేలా చేస్తోంది. -
హద్దులు చెరిపేసి.. చుట్టూ కంచె వేసి
[ 17-05-2024]
జంట జలాశయాలకు సమీపంలో ప్రభుత్వ, నిషేధిత భూముల వివరాలను సేకరించి కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. -
వరుణుడి ఆట.. అభిమానుల ఇంటి బాట
[ 17-05-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
చినుకు పడితే.. కానరాని సిటీ బస్సులు
[ 17-05-2024]
నగరంలో ఏమాత్రం వర్షం పడినా ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతోంది. -
350 ఫీడర్లలో ట్రిప్పింగ్
[ 17-05-2024]
బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడం, చెట్ల కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో బ్రేక్డౌన్లు ఏర్పడ్డాయి. -
పోకల్వాడ భూముల కబ్జాపై దర్యాప్తు
[ 17-05-2024]
మణికొండ ఐటీ కారిడార్ సమీపంలోని పోకల్వాడలో ఐదెకరాల భూమి కబ్జా వ్యవహారం కీలకమలుపు తిరిగింది. -
ఐసీఎస్ఎస్ఆర్ జాతీయ సదస్సు 29న
[ 17-05-2024]
ఆర్జీ కేడియా వాణిజ్య కళాశాలలో ఈ నెల 29న ‘వ్యాపార పద్ధతులు- కొత్త పరిశోధనలు’ అనే అంశమై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. -
పెండింగ్ డీఏలు ఇప్పించాలి
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చర్యలు చేపట్టాలని -
అకాల చినుకు..అన్నదాతకు వణుకు
[ 17-05-2024]
రైతన్న అనుకున్నంతా అయింది. అకాల వర్షం పడితే తాము పడిన కష్టం అంతా నీటి పాలవుతుందని నిత్యం ఆకాశంలో మబ్బులు పడితే ఆందోళన చెందుతున్నారు. -
బాహ్య వలయం.. అసంపూర్ణం
[ 17-05-2024]
తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా ‘బాహ్య వలయ రహదారి’ మంజూరైంది. -
సౌకర్యాలు కరవాయె.. రైతన్నకు దిగులాయె
[ 17-05-2024]
ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి. -
కులగణన ప్రక్రియ సత్వరం చేపట్టండి
[ 17-05-2024]
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. -
పురపాలికగా మహేశ్వరం!
[ 17-05-2024]
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పురపాలికగా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు 19
[ 17-05-2024]
లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. -
సోమాలియా బాలిక కడుపులో 3.75 కిలోల కణితి తొలగింపు
[ 17-05-2024]
సోమాలియా దేశానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక కడుపులో ఉన్న భారీ కణితిని సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించి ఆమెకు ఊరట కల్పించారు. -
సుంకిశాల పనుల్లో జాప్యంపై ఆరా
[ 17-05-2024]
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై జలమండలి దృష్టి సారించింది. -
‘ఉచిత బియ్యం పంపిణీపై అవగాహన కరవు’
[ 17-05-2024]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
పోలింగ్పై ఎడతెగని సమీక్ష
[ 17-05-2024]
చేవెళ్ల లోక్ సభకు సంబంధించి ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
పోగొట్టుకున్న 300కళ్లద్దాల ఫ్రేమ్ల అప్పగింత
[ 17-05-2024]
రైల్లో పోగొట్టుకున్న 300 కళ్లద్దాల ఫ్రేమ్ల సెట్లను ఆర్పీఎఫ్ పోలీసులు బాధితునికి అప్పగించిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా