New Year Celebrations: 31 రాత్రి తాగి నడిపితే ఊచలే.. డ్రైవర్లు రైడ్ నిరాకరిస్తే జరిమానా
నయాసాల్ వేడుకల్లో అతిగా మద్యం తాగి నడిపే వాహనదారులతోపాటు అందుకు కారణమైన పబ్బులు, బార్లు, క్లబ్బుల నిర్వాహకులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.
రాయదుర్గం, న్యూస్టుడే: నయాసాల్ వేడుకల్లో (Year Ender 2023) అతిగా మద్యం తాగి నడిపే వాహనదారులతోపాటు అందుకు కారణమైన పబ్బులు, బార్లు, క్లబ్బుల నిర్వాహకులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. యాజమాన్యాలు తమ ప్రాంగణంలో మద్యం తాగేందుకు ప్రోత్సహించినందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అతివేగం, రాంగ్ రూట్, సిగ్నల్ అతిక్రమణ, నిర్లక్ష్య డ్రైవింగ్, శిరస్త్రాణం ధరించకపోతే గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఉల్లంఘనలు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నూతన సంవత్సర వేడుకల (New Year Celebrations) నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ డీవీవీ శ్రీనివాస్ బుధవారం ప్రత్యేక మార్గదర్శకాలు, సూచనలు జారీ చేశారు.
డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు
- అన్ని రహదారుల్లో రాత్రి 8 గంటల నుంచి డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తారు. పట్టుబడితే మొదటిసారికి రూ.10 వేల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. ఎక్కువసార్లు దొరికితే రూ.15 వేలు లేదా రెండేళ్ల జైలు శిక్ష. డ్రైవింగ్ లైసెన్సు సస్పెన్షన్కు సిఫారసు చేస్తారు.
- ధ్రువపత్రాల్లేకుంటే వాహనాలను స్వాధీనం చేసుకుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, బాలలు వాహనాలు నడిపి పట్టుబడితే యజమాని సహా ఇద్దరిపైనా చర్యలుంటాయి.
- అధిక శబ్దాలతో పాటలున్నా.. నంబరు ప్లేట్ లేకున్నా సీజ్ చేస్తారు.
- కార్లల్లో కిక్కిరిసి, పైభాగంలో కూర్చుని ప్రయాణించకూడదు.
- ఔటర్రింగ్రోడ్డు, పీవీ ఎక్స్ప్రెస్వేపై రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయానికి వెళ్లేవి మినహా ఇతర వాహనాలకు అనుమతి లేదు.
- రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు శిల్పాలేవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్పేట, మైండ్ స్పేస్, రోడ్ నం.45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్జి, సైబర్ టవర్స్, ఫోరం మాల్, జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాలానగర్ బాబుజగ్జీవన్రామ్పైవంతెనలు మూసేస్తారు.
డ్రైవర్లు రైడ్ నిరాకరిస్తే జరిమానా
- ట్యాక్సీ, క్యాబ్, ఆటో డ్రైవర్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ అనుచితంగా ప్రవర్తించకూడదు.
- క్యాబ్ డ్రైవరు ఎట్టి పరిస్థితుల్లో రైడ్ నిరాకరించొద్దు. దీన్ని మోటారు వాహనాల చట్టం ఉల్లంఘన కింద రూ.500 జరిమానా విధిస్తాం.
- రైడ్ రద్దు చేసినట్లు గుర్తిస్తే వాహనం నంబరు, సమయం, ప్రదేశం తదితర వివరాలతో 94906 17346కు ఫిర్యాదు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్విచక్రవాహనాలపై వచ్చి.. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి హత్య
[ 14-06-2024]
చేవెళ్ల మండలం తంగడ్పల్లి గ్రామంలో రులాఖాన్ (58) శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురయ్యాడు. -
మ్యాన్హోల్.. నాణ్యత నిల్
[ 14-06-2024]
నగరంలోని అనేక ప్రాంతాల్లో వరదనీటి నాలాల మ్యాన్హోళ్లు ఛిద్రమయ్యాయి. వాహనాల రాకపోకలతో ముక్కలయ్యాయి. కొన్నిచోట్ల మూతలు పూర్తిగా గల్లంతయ్యాయి. వాహనదారులు వాటిలో పడుతున్నారు. -
కవలలు.. చూసుకునేందుకు గొడవలు
[ 14-06-2024]
పిల్లల సంరక్షణ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో ఓ తల్లి తన కవల పిల్లలను చెరువులో పడేసి ఆత్మహత్యకు యత్నించింది. -
నగరాన చినుకులు
[ 14-06-2024]
మలక్పేట, చార్మినార్ తదితర ప్రాంతాల్లో గురువారం కుండపోత వర్షం కురిసింది. మలక్పేట్ న్యూ మార్కెట్లోకి మోకాలు లోతున వరద చేరింది. ప్రధాన రహదారుల్లో పెద్ద ఎత్తున వరద ప్రవహించింది. -
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగొద్దు
[ 14-06-2024]
వానాకాలంలో మెట్రోరైలు కార్యకలాపాలకు అంతరాయాలు తలెత్తకుండా నిరంతరంగా సేవలు అందించడంపై ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ కంపెనీ కియోలిస్, స్వతంత్ర ఇంజినీర్ ఏఈకామ్ సీనియర్ అధికారులతో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి బేగంపేటలోని మెట్రోరైలు భవన్లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. -
డ్రోన్లతో మందు.. ఇక వద్దు
[ 14-06-2024]
దోమల నియంత్రణకు ఉపయోగిస్తోన్న డ్రోన్లు నిరుపయోగంగా మారాయని, వాటికి చేస్తోన్న ఖర్చు వృథా అని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వాటి సేవలను రద్దు చేసింది. డ్రోన్లతో పిచికారీ చేస్తోన్న మందుతో దోమల కట్టడి సాకారం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోనల్ అధికారులు వెల్లడించారు. -
16 కేసులు.. 10 మారుపేర్లు
[ 14-06-2024]
హైటెక్ విధానంలో వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిర్వాహకులు, ఒక విటుడిని అరెస్టు చేసి.. ఆరుగురు యువతులను రక్షించారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలిపై గతంలో 16 కేసులున్నాయి. -
సిగరెట్ ఇవ్వకపోగా.. హేళన చేశాడని హత్యాయత్నం
[ 14-06-2024]
తాను అడిగితే సిగరేట్ ఇవ్వకపోవడమే కాకుండా నలుగురు ముందు తనను హేళన చేశాడని హత్య చేయడానికి ప్రయత్నించిన నిందితుడిని నారాయణగూడ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. -
బంతి పడకుండానే.. రూ.కోట్లు ఔట్
[ 14-06-2024]
క్రికెట్ ఆటలో బంతి పడితేనే బ్యాట్స్మెట్ ఔట్ అవుతాడు.. కానీ జీహెచ్ఎంసీలో బంతి పడకుండానే రూ.కోట్లు ఔట్ అయిపోతున్నాయి. ఏటా ఇదే వ్యవహారం సాగుతున్నా చూడీచూడనట్టు వదిలేస్తున్నారు. -
కిషన్రెడ్డిపైనే నగర వాసుల ఆశలన్నీ..!
[ 14-06-2024]
సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో గెలిచిన కిషన్రెడ్డి అందరూ ఊహించిన విధంగానే కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇక నగర ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. -
సంప్రదాయ ఆహార ఉత్పత్తులకు ఆదరణ
[ 14-06-2024]
సంప్రదాయ ఆహార ఉత్పత్తులకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు. బ్లిడ్జ్ ఎగ్జిబిషన్, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (టీఎఫ్పీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్స్లో మూడు రోజుల ‘ఫుడ్ ఎ ఫెయిర్’ (ఆహార ఉత్పత్తుల ప్రదర్శన)ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పార్రంభించారు. -
ఆత్మస్థైర్యంతో ముందడుగేస్తే విజయాలు
[ 14-06-2024]
ఆత్మస్థైర్యంతో ముందడుగేస్తే విజయాలు సాధించవచ్చని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి అన్నారు. గోపన్పల్లి జవహర్ నవోదయ విద్యాలయంలో గురువారం ఆయన నవోదయ విద్యాలయాల విద్యార్థుల పారా స్పోర్ట్స్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. -
ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాలకు నూతన భవన నిర్మాణం
[ 14-06-2024]
నిమ్స్ విస్తరణ పనుల్లో భాగంగా ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నూతన భవనం నిర్మించే వరకు కూల్చవద్దంటూ పాఠశాల పూర్వ విద్యార్థుల డిమాండ్కు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. -
అంతర్జాతీయ పురస్కారానికి అమృతవల్లి
[ 14-06-2024]
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీప్రకాశ్ సినర్జీ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న ఎ.వి.ఎస్.డి.అమృతవల్లి అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైనట్లు ‘మన సంస్కృతి’ సంస్థ (హైదరాబాద్) పరీక్ష సంచాలకుడు డా.అనిల్కుమార్ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు. -
కిన్నెర మొగిలయ్యకు మంత్రి పొన్నం సన్మానం
[ 14-06-2024]
పద్మశ్రీ అవార్డు గ్రహీత, కళాకారుడు కిన్నెర మొగిలయ్య రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
మీసేవ కేంద్రంలో అదనపు వసూళ్లు
[ 14-06-2024]
నిర్దేశిత ఛార్జీలకు బదులు అదనంగా డబ్బులు వసూలు చేసిన మీసేవా కేంద్రానికి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. -
వ్యక్తిగత గోప్యతను హరిస్తున్నారు
[ 14-06-2024]
కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత, ఉపగ్రహాల సాయంతో ప్రజల వ్యక్తిగత గోప్యతను అమెరికన్ కార్పొరేట్ సంస్థలు హరిస్తున్నాయని, మానవ మెదడును తమ నియంత్రణలోకి తీసుకుని ప్రజల కోరికలు, సంకల్పాన్నీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నాయని వాటిని నిరోధించాల్సిన అవసరం ఉందని టార్గెటెడ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పేర్కొన్నారు. -
ప్రభుత్వ స్థలం పరిశీలన
[ 14-06-2024]
బషీరాబాద్ మండల కేంద్రంలోని జీవన్గీ రోడ్డు మార్గంలో ప్రభుత్వ స్థలాన్ని గురువారం తహసీల్దార్ వెంకటేష్, సహకార సంఘం ఉపాధ్యక్షులు అజయ్ ప్రసాద్ పరిశీలించారు. -
సమీకృతం అసంపూర్ణం.. సమస్యలు నిత్యకృత్యం
[ 14-06-2024]
తాజా కూరగాయలతో పాటు జిల్లా వినియోగదారులకు మాంసం, పాలు, పండ్లు ఒకే చోట విక్రయించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన సమీకృత మార్కెట్ల నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. -
శుభకార్యానికి వెళ్తూ.. ఇద్దరి దుర్మరణం
[ 14-06-2024]
శుభకార్యానికి ఆటోలో వెళ్తూ మార్గ మధ్యన ఎదురుగా వస్తున్న సిమెంటు ట్యాంకర్ ఢీ కొనడంతో ఆటోలో ఉన్న ఇద్దరు మృతి చెందగా, మరో 12 మందికి గాయాలైన సంఘటన వికారాబాద్ మండలంలోని చించల్పేట గేటు సమీపంలో గురువారం జరిగింది. -
మాటు వేస్తున్నాయి.. దాడి చేస్తున్నాయి
[ 14-06-2024]
దామగుండం అటవీ ప్రాంతంలో మూగ జీవాలు శునకాల దాడిలో తీవ్ర గాయాల పాలవుతున్నాయి. కొన్ని మృత్యువాత పడుతున్నాయి. వీటిలో ప్రధానంగా జింకలే ఎక్కువగా ఉండటం గమనార్హం. -
వ్యాయామ అధ్యాపకులు.. ఒక్కరూ లేరు!
[ 14-06-2024]
క్రీడలు మానసిక, శారీరక ద్రుఢత్వానికి దోహదపడతాయని పలు సందర్భాల్లో నేతలు వల్లె వేస్తుంటారు. కళాశాలలో, పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్న వారు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచిస్తుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. ఎస్వీ యూనివర్సిటీలో సంబరాలు
-
సూపర్-8 పోరుకు ముందే.. ఆ ఇద్దరు స్వదేశానికి!
-
ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం సతీమణి రాజీనామా
-
‘కాళేశ్వరం’పై కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ విచారణ
-
జులై 22న కేంద్ర బడ్జెట్.. జులై 3న ఆర్థిక సర్వే..!