Hyderabad: నగరంలో భూముల లెక్కలు.. ఇక పక్కా
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలోని భూముల లెక్కను మరింత పకడ్బందీగా చేయనున్నారు.
ఏడు జిల్లాల్లో 10 వేల ఎకరాలకుపైగా గుర్తింపు
జియోట్యాగ్, జీపీఎస్ మ్యాపింగ్తో రక్షణకు చర్యలు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలోని భూముల లెక్కను మరింత పకడ్బందీగా చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఎస్టేట్ విభాగం అధికారులు ఏడు జిల్లాల పరిధిలోని ల్యాండ్ పార్శిళ్లపై ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు 10 వేల ఎకరాలపైనే హెచ్ఎండీఏ ల్యాండ్ బ్యాంకులో ఉన్నట్లు తేలింది. ఇందులో 2031 ఎకరాల్లో కోర్టు కేసులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. హెచ్ఎండీఏ తరపున ఈ వివరాలను కోర్టుకు సమర్పించి... త్వరగా కేసులు తేలేలా నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి, భువనగిరి, సిద్ధిపేట జిల్లాల్లో హెచ్ఎండీఏకు రూ.కోట్ల విలువైన భూములు ఉన్నాయి. సరైన రక్షణ లేక ఆక్రమణలకు గురవుతున్నాయి. ప్రస్తుతం కోర్టు కేసులు నడుస్తున్నవాటిలో చాలా వరకు ఆక్రమణలకు సంబంధించినవే. ఇటీవలి శంషాబాద్లో ఓ వ్యక్తి 50 ఎకరాలను తప్పుడు పత్రాలతో సొంతం చేసుకున్నాడు. హైకోర్టు వరకు వ్యవహారం వెళ్లడం.. చివరికి కోర్టు జోక్యంతో తిరిగి హెచ్ఎండీఏ ఈ విలువైన భూములను దక్కించుకుంది. ఆక్రమణలను ముందే అడ్డుకుంటే పరిస్థితి అంతదాకా వచ్చేది కాదనేది బహిరంగ రహస్యం. జవహర్నగర్లో హెచ్ఎండీఏకు రెండువేల ఎకరాలకు పైనే భూములుండగా.. ఇందులో వెయ్యికి పైగా ఎకరాల్లో కోర్టు కేసులు నడుస్తున్నాయి. స్థానిక అధికార యంత్రాంగం అండదండలతోనే ఇక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇకపై ఈ భూముల లెక్క తేల్చడంతో పాటు సాంకేతిక సహకారంతో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయనున్నారు.
ఆన్లైన్ ద్వారా పర్యవేక్షణ
హెచ్ఎండీఏ పరిధిలోని భూముల రక్షణకు చర్యలు తీసుకునేందుకు హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది. జీపీఎస్ మ్యాపింగ్ చేయడం, జియోట్యాగ్ లాంటి సాంకేతిక విధానంలో ప్రతి ఖాళీ స్థలంపై నిఘా ఉంచనున్నారు. కొన్నేళ్లుగా భూముల ధరలకు రెక్కలు రావడంతో చిన్న స్థలం కనిపించినా.. ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులకు ఈ విషయం తెలిసి కూల్చేలోపు కోర్టునుంచి స్టేలు తీసుకొచ్చి నడిపిస్తున్నారు. జీపీఎస్, జియోట్యాగ్తో ఎప్పటికప్పుడు ఆయా భూముల్లో జరుగుతున్న ఆక్రమణలు ప్రధాన కార్యాలయం నుంచే ఆన్లైన్లో తెలుసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో కొన్ని విలువైన భూములను ఆన్లైన్లో వేలం వేసి విక్రయించిన సంగతి తెలిసిందే. కోకాపేట, బుద్వేల్ లాంటి ప్రాంతాల్లో వందల కోట్లు ధరలు పలికాయి. విలువైన భూముల రక్షణతో ప్రభుత్వ అవసరాలు, పరిశ్రమలు, వివిధ సంస్థల స్థాపనకు ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో ఆక్రమణలకు గురికాకుండా పకడ్బందీ కార్యచరణకు అధికారులు రూపకల్పన చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారణాసిలో ప్రచారానికి భాజపా బృందం
[ 19-05-2024]
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంద్రమోదీకి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు 10 మంది సభ్యులతో కూడిన భాజపా బృందాన్ని ఎంపిక చేశారు. -
ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలి
[ 19-05-2024]
రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని, ఒక యాజమాన్యం కింద ఒకే విద్యా సంస్థ ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
పోరాటయోధుల చరిత్ర గ్రంథస్థం చేస్తాం
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన తొలి పోరాటంలో అమరులైన వీరులు, జైలుకెళ్లిన, అంగవైకల్యం చెందిన యోధుల త్యాగాలు చరిత్రకెక్కలేదని, ఆ త్యాగధనుల జీవితాలను గ్రంథ]స్థం చేస్తున్నట్లు తెలంగాణ -
రైల్వే, ఆదాయపన్నుశాఖలో ఉద్యోగాల పేరుతో మోసం
[ 19-05-2024]
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించిన నిందితుడిని ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ కథనం ప్రకారం.. -
క్యాన్సర్పై సమగ్ర పుస్తకం అభినందనీయం
[ 19-05-2024]
క్యాన్సర్ మహమ్మారికి శాశ్వత పరిష్కారం దిశగా పరిశోధనలు జరగాలని ఓయూ వీసీ ప్రొ.రవీందర్ అన్నారు. విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ (సీపీఎంబీ) డైరెక్టర్ డా.రామకృష్ణ
తాజా వార్తలు (Latest News)
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్