logo

‘లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధిస్తాం’

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో రెండంకెల సీట్లను సాధించిన సత్తా చాటుతామని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌, భారాస పార్టీలు రెండూ ఒక్కటేనని..

Published : 28 Mar 2024 03:28 IST

మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. చిత్రంలో గౌతంరావు, రవీందర్‌గౌడ్‌ తదితరులు

గోల్నాక, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో రెండంకెల సీట్లను సాధించిన సత్తా చాటుతామని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌, భారాస పార్టీలు రెండూ ఒక్కటేనని.. వాటికి ఓటేస్తే వృథానేనని ఆయన అన్నారు. బుధవారం గోల్నాకలో భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు గౌతంరావుతో కలిసి పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ ప్రజలు మరోసారి మోదీ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. ఈ దఫా అన్ని ఎంపీ స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను పోటీకి దించామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటనలకు రాష్ట్ర ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని భాజపా ఎన్నికల ప్రచారం మొదలైందని, దీనిలోభాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని