logo

మోదీ పాలనతోనే గ్రామాల్లో మార్పు: కొండా

కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అనేక రకాలుగా మార్పు వచ్చిందని చేవెళ్ల పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా గురువారం మిట్టకంకల్‌, కడ్మూరు, మేడిపల్లి కలాన్‌ గ్రామాల్లో పర్యటించారు.

Published : 29 Mar 2024 03:25 IST

కడ్మూరులో మాట్లాడుతున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

పూడూరు: కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అనేక రకాలుగా మార్పు వచ్చిందని చేవెళ్ల పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా గురువారం మిట్టకంకల్‌, కడ్మూరు, మేడిపల్లి కలాన్‌ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమలం గుర్తుకు ఓటువేసి ఆశీర్వదించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం మాట్లాడుతూ నిజాయతీ గల వ్యక్తి కొండావిశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. కొంత కాలంగా పదవుల్లో లేకున్నా పేద ప్రజల సంక్షేమానికి ఎంతో కృషిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, మండల అధ్యక్షులు రాఘవేందర్‌, ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యులు మల్లేష్‌ పటేల్‌, నాయకులు కేబి రాజు, మిట్ట పరమేశ్వర్‌ రెడ్డి, రవీందర్‌, రాజేందర్ర్‌ెడ్డి, శివకుమార్‌, పాండుగౌడ్‌ ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని