ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ చర్యలు
లోక్సభ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు పటిష్ఠ బందోబస్తు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి వెల్లడించారు. 5 లోక్సభ నియోజకవర్గాల్లో విస్తరించిన కమిషనరేట్ పరిధిలో తీసుకుంటున్న చర్యలపై ‘ఈనాడు’ ముఖాముఖిలో మాట్లాడారు.
బందోబస్తు విధుల్లో 5 వేల మంది పోలీసులు
12 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపు
‘ఈనాడు’ ముఖాముఖిలో రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి వెల్లడి
ఈనాడు- హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు పటిష్ఠ బందోబస్తు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి వెల్లడించారు. 5 లోక్సభ నియోజకవర్గాల్లో విస్తరించిన కమిషనరేట్ పరిధిలో తీసుకుంటున్న చర్యలపై ‘ఈనాడు’ ముఖాముఖిలో మాట్లాడారు.
ప్రశ్న: ఎన్నికల్లో భద్రతకు తీసుకున్న చర్యలేంటి?
జవాబు : మల్కాజిగిరి, భువనగిరి నియోజకవర్గాలు ఎక్కువగా..చేవెళ్ల, నాగర్కర్నూలు, హైదరాబాద్ నియోజకవర్గాలు పాక్షికంగా కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి.1,590 ప్రాంతాల్లో 3,396 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో 533 సమస్యాత్మకమైనవి. 5వేల మంది పోలీసులు, 12 కంపెనీల కేంద్ర బలగాలు, శిక్షణలోని కానిస్టేబుళ్లు, ఎస్సైలను బందోబస్తులో ఉంటారు. ఎక్కడకైనా క్షణాల్లో చేరుకునేలా వ్యూహం రూపొందించాం.
ప్ర: ఘర్షణలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలేంటి?
జ: 84 శాతం సాధారణ పోలింగ్ కేంద్రాలున్నాయి.పోలింగ్ రోజు పెట్రోలింగ్, రూట్ మొబైల్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, బ్లూకోల్ట్స్ విధుల్లో ఉంటారు. ప్రత్యేక పికెట్లు ఉంటాయి.
ప్ర: డీఆర్సీ కేంద్రాలు, ఈవీఎంల తరలింపు మార్గాల ఖరారు, పోలీసులకు శిక్షణ పూర్తయిందా ?
జ: 8 డీఆర్సీ కేంద్రాలు, 3ఓట్ల లెక్కింపు కేంద్రాలున్నాయి. ఈవీఎంలతరలింపునకు రూట్మ్యాప్ ఖరారైంది. 20 శిక్షణ సదస్సులు నిర్వహించాం.62 చోట్ల ఫ్లాగ్ మార్చ్ చేశాం.అక్రమ నగదు, మద్యం, ఉచితాల తరలింపును అడ్డుకుంటున్నాం.
ప్ర: రౌడీషీటర్ల బైండోవర్, ఆయుధాల స్వాధీనం పూర్తయిందా?
జ: లైసెన్స్డ్ ఆయుధాల స్వాధీనం పూర్తయింది. మొత్తం 1,114 లైసెన్సులున్నాయి.బ్యాంకుల భద్రతా సిబ్బంది, నగదు తరలించే 252 లైసెన్సులకు మినహాయింపులు ఉన్నాయి. రౌడీషీటర్లు, పాత నేరస్థులు, గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడ్డవారు 4,780 మందిని బైండోవర్ చేశాం.
ప్ర: సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల కట్టడి ఎలా?
జ: ఇలాంటి వాటిపై నిఘా ఉంచుతాం. ఖాతాదారులు తమకు వచ్చే వీడియోలు, పోస్టులను తనిఖీ చేయకుండా ఇతరులకు షేర్ చేయొద్దు. కంటెంట్పై అనుమానాలుంటే పోలీసులను సంప్రదించాలి. నకిలీవని తెలిసీ వైరల్ చేస్తే చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు