logo

వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తాం : ఎస్‌ఈ

విద్యుత్తు వినియోగదారుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని విద్యుత్తు సంస్థ ఎస్‌ఈ శోభావాలెంటీనా పేర్కొన్నారు. తన కార్యాలయం నుంచి నిర్వహించిన డయల్‌యువర్‌ విద్యుత్తు ఎస్‌ఈ కార్యక్రమంలో గురువారం వినియోగదారుల నుంచి వచ్చిన ఫోన్‌

Published : 20 May 2022 03:36 IST


డయల్‌ యువర్‌ విద్యుత్తు ఎస్‌ఈ కార్యక్రమంలో సమస్యలు
వింటున్న ఎస్‌ఈ శోభావాలెంటీనా, అధికారులు

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగదారుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని విద్యుత్తు సంస్థ ఎస్‌ఈ శోభావాలెంటీనా పేర్కొన్నారు. తన కార్యాలయం నుంచి నిర్వహించిన డయల్‌యువర్‌ విద్యుత్తు ఎస్‌ఈ కార్యక్రమంలో గురువారం వినియోగదారుల నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ను ఆమె రిసీవ్‌ చేసుకున్నారు. అనంతరం ఆమె అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. తీగలకు సంబంధించిన సమస్య ఒకటి, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సమస్యలు రెండేసి రాగా వ్యవసాయ సంబంధంగా నాలుగు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. డీఈలు కృష్ణదేవ, సుబ్రహ్మణ్యం, జేఈ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని