తనిఖీల్లో పట్టుకున్న డబ్బుల అప్పగింత
లోక్సభ ఎన్నికల పోరు ముగిసింది. ఎన్నికల సమయంలో జిల్లాలో ఓటర్లను ప్రలోభపెట్టే వస్తువులేవీ తరలించకుండా, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తరలించకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
న్యూస్టుడే, సిరిసిల్ల కలెక్టరేట్
చెక్పోస్టులో తనిఖీ చేస్తున్న పోలీసులు, అధికారులు (పాతచిత్రం)
లోక్సభ ఎన్నికల పోరు ముగిసింది. ఎన్నికల సమయంలో జిల్లాలో ఓటర్లను ప్రలోభపెట్టే వస్తువులేవీ తరలించకుండా, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తరలించకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 6 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులతో పాటు పోలీసు తనిఖీల్లో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తరలిస్తుండటంతో పట్టుకుని సీజ్ చేశారు. సీజ్ చేసిన డబ్బులకు సరైన ఆధారాలు చూపించిన 55 మందికి రూ.64,43,260 తిరిగి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్పోస్టులు
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ఎక్స్రోడ్డు, ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి, గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజి, రుద్రంగి మండలం కలికోట, వేములవాడ గ్రామీణ మండలం ఫాజుల్నగర్, బోయినపల్లి మండలం కొదురుపాక ఎక్స్రోడ్డులో చెక్పోస్టులను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను అమర్చారు. వీటిని కలెక్టరేట్లోని ఫిర్యాదుల కేంద్రానికి అనుసంధానం చేసి 24 గంటలూ పర్యవేక్షించారు. జిల్లాలోకి వచ్చిపోయే వాహనాలను చెక్పోస్టుల వద్ద ఉన్న అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో రూ.82 లక్షల వరకు నగదు సీజ్ చేసి 57 కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో పట్టుకున్న డబ్బులను జిల్లా గ్రీవెన్స్ సెల్లో జమ చేశారు. డబ్బులను తిరిగి అప్పగించడానికి సరైన ఆధారాలు చూపించడానికి జిల్లాలో త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఛైర్మన్గా డీఆర్డీవో శేషాద్రి, సభ్యులుగా డీటీవో నీరజ, ఎస్టీవో రవీందర్లను నియమించారు. నగదుకు సంబంధించిన సరైన ఆధారాలను పరిశీలించిన అనంతరం ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఇప్పుడు ఆ పత్రాన్ని తీసుకొని డబ్బులు స్వాధీనం చేసుకున్న వ్యక్తులు ఏ నియోజకవర్గంలో ఉన్నారో అక్కడి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పత్రాన్ని అందిస్తే వారి డబ్బులను తిరిగి ఇచ్చారు.
సరైన ఆధారాలు చూపించాలి
రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తరలిస్తున్న వ్యక్తులు తనిఖీల్లో పట్టుబడినప్పుడు సరైన ఆధారాలు చూపించి డబ్బులను తీసుకెళ్లారు. పట్టుబడిన సమయంలో అక్కడి అధికారులు ఇచ్చిన నోటీసుతోపాటు డబ్బులను ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారో దానికి సంబంధించి ఆధారం జిల్లా కలెక్టరేట్లోని గ్రీవెన్స్సెల్లో చూపిస్తే త్రీమెన్ కమిటీ పరిశీలించి ధ్రువీకరణ పత్రం అందజేయడం జరిగింది. దానిని తీసుకొని సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సంప్రదించిన వారికి డబ్బులు అందజేస్తున్నాం. మిగిలిన వారు కూడా సరైన ఆధారాలు తీసుకు వచ్చి డబ్బులు తీసుకోవాలి.
శేషాద్రి, డీఆర్డీవో, గ్రీవెన్స్సెల్ ఛైర్మన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగు జిల్లాలకు కొత్త కలెక్టర్లు
[ 16-06-2024]
లోక్సభ ఎన్నికల పర్వం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 20 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగించింది. -
నాన్న కష్టమే నడిపించింది
[ 16-06-2024]
ప్రతి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేసేది అమ్మైతే.. ప్రపంచాన్ని పరిచయం చేసేది మాత్రం నాన్నే. బిడ్డలు ఎదుగుతుంటే ఆనందిస్తాడు. తన సర్వస్వాన్ని పిల్లలకు అంకితం చేస్తాడు. జీవితాన్నే బిడ్డలకు త్యాగం చేస్తాడు. -
గుర్తింపు పత్రం అందేనా..!
[ 16-06-2024]
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఏఐటీయూసీకి గుర్తింపు పత్రం ఇవ్వడంలో ఇంకా జాప్యం కొనసాగుతూనే ఉంది. -
ఆరుద్రల ఆగమనం
[ 16-06-2024]
ఎర్రని పట్టువస్త్రాన్ని కప్పుకొన్నట్లుగా చూడముచ్చటగా కనిపించే ఈ కీటకాలు ఏడాదిలో కేవలం ఆరుద్రకార్తె ఆగమనంలోనే దర్శనమిస్తాయి కాబట్టి వీటిని ఆరుద్ర పురుగులుగానే పిలుస్తారు. -
రుణ లక్ష్య సాధనలో ప్రథమం
[ 16-06-2024]
కరీంనగర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు లక్ష్యంతో దూసుకుపోతున్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
[ 16-06-2024]
మోసపూరితమైన ఆన్లైన్ యాప్ల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దని, సైబర్ నేరగాళ్లపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో సూచించారు. -
నిబంధనలు పాటించకుంటే చర్యలు
[ 16-06-2024]
ప్రైవేటు పాఠశాలల బస్సులను వాహన తనిఖీ అధికారి భీమ్సింగ్ శనివారం పరిశీలించారు.