ఆధునికీకరణే అసలైన మందు
రాష్ట్రంలోని మరమగ్గాల వస్త్రోత్పత్తి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందిస్తుంది. ఎన్నికల కోడ్ ముగిసేలోగా వీటి విధి విధానాలు వెల్లడించనుంది.
మార్కెట్ పోటీని తట్టుకుంటేనే వస్త్ర పరిశ్రమ మనుగడ
ప్రభుత్వ నిర్ణయంతో నేతన్నల్లో ఆశలు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
మరమగ్గాలపై వస్త్రోత్పత్తులు
రాష్ట్రంలోని మరమగ్గాల వస్త్రోత్పత్తి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందిస్తుంది. ఎన్నికల కోడ్ ముగిసేలోగా వీటి విధి విధానాలు వెల్లడించనుంది. మరమగ్గాలపై వస్త్రోత్పత్తి రాష్ట్రం మొత్తం జిల్లాలోనే ఎక్కువ జరుగుతుంది. ప్రభుత్వం మరమగ్గాల ఆధునికీకరణ, మార్కెటింగ్, కార్మికుల ఉపాధి వంటి అంశాలతో ప్రణాళికలు రూపొందిస్తుంది. వాటి ద్వారా ప్రయోజనం పొందడంలో జిల్లా వస్త్ర పరిశ్రమ ముందుంటుంది. ఇక్కడి వస్త్రోత్పత్తులు యజమాని, ఆసామి, కార్మికులు అనే మూడంచెల వ్యవస్థలో నడుస్తున్నాయి. 30 వేలకు పైగా మరమగ్గాలు, వేలాది మంది కార్మికులు, నిత్యం లక్షలాది మీటర్ల కాటన్, పాలిస్టర్ వస్త్రాలు ఉత్పత్తి చేస్తున్నారు. వీరికి ప్రభుత్వ ఆర్డర్లు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి పీస్రేట్పై ఉత్పత్తి చేస్తుంటారు. వీటిలో చాలా వరకు ముతక రకం ఉత్పత్తులకే పరిమితమయ్యారు. దశాబ్దాలుగా పురాతన మరమగ్గాలతోనే కాలం వెళ్లదీస్తున్న జిల్లా పరిశ్రమలో ఆధునికీకరణ ప్రక్రియలేవీ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు.
- జిల్లాలోని వస్త్ర పరిశ్రమ ఆధునికీకరణ, కార్మికుల నైపుణ్యాలు పెంచేలా గత అయిదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పథకాలేవీ అమలుకు నోచుకోలేదు. 2019లో కేంద్ర ప్రభుత్వం పవర్టెక్స్ ఇండియాలో పదిహేను వేల మరమగ్గాల ఆధునికీకరణకు అధికారులు ప్రణాళికలు చేశారు. దానిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం చెల్లించి ఒక్కో కార్మికుడికి వందశాతం రాయితీతో నాలుగు మరమగ్గాల వరకు ఆధునికీరణకు ప్రణాళికలు రూపొందించారు. అప్పుడు దీనికోసం రూ.30 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వీటితో పది వేల మరమగ్గాలకు డాబీలు, ఆటోమేటిక్ నియంత్రణ యంత్రాలను అమర్చారు. అప్పటి నుంచి వస్త్ర పరిశ్రమలో ఆధునికీకరణ అన్న ఊసేలేదు.
- బతుకమ్మ చీరల ఉత్పత్తిలో డిజైన్ల కోసం 2021లో ఆటోమేటిక్, ఎలక్ట్రానిక్ జకార్డులు అమర్చుకోవాలని సూచించారు. అప్పటికప్పుడు పరిశ్రమ వర్గాలు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిశ్రమల్లో వాడిన వాటి పరికరాలను తెచ్చుకుని బిగించుకున్నారు. ఒక్కో పరికరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఖర్చుయింది. పాత పరికరాలు కావడంతో ప్రభుత్వం వీటి ఆధునికీకరణకు నిధులు ఇవ్వలేదు. పరోక్షంగా ఉత్పత్తి చేసిన చీరలపై ప్రోత్సాహకాల రూపంలో అందించింది.
- 2022లో అప్పటి ప్రభుత్వం మరమగ్గాల ఆధునికీకరణకు ప్రభుత్వం టీ-ట్యాప్ (తెలంగాణ టెక్స్టైల్ అపరెల్ పాలసీ)ని తీసుకొచ్చింది. తొలుత టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమలను చేసి తర్వాత విస్తరించాలనే ఆలోచన చేశారు. పరిశ్రమ వర్గాలకు అవగాహన కల్పించడం, ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించారు. అందులో ప్రాసెసింగ్ యూనిట్, రాపియర్ మగ్గాల నుంచి ఎయిర్జెట్కు అప్గ్రేడ్ చేసుకోవడం, ఆధునిక డైయింగ్ యూనిట్, గార్మెంటరీ ఉత్పత్తుల కోసం మొత్తం ఎనిమిది మంది ఔత్సాహికులు రూ.52 కోట్ల ప్రణాళికలతో ముందుకొచ్చారు. ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం ఇవన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
- మార్కెట్లో పోటీని తట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు తీసుకురావాలి. దానికి పరిశ్రమలో ఆధునికీకరణే అసలైన ఔషధం. ఇక్కడి పరిశ్రమలోని ప్రాధాన్యతలను గుర్తించాలి. పథకం అమలుకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం జిల్లా నేతన్నలు ఎదురుచూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేనేం పాపం చేశానమ్మా!
[ 15-06-2024]
అమ్మా.. ఏడుస్తున్నావా! ఎందుకమ్మా రోదిస్తావ్.. నీ ఒడిలో ఉండగానే ఓ మృగం నన్ను కాటేసిందని కుమిలిపోతున్నావా! తల్లి పొత్తిళ్లలోనే ఆడపిల్లకు రక్షణ లేదని బాధ పడుతున్నావా.. అయినా.. ఏడ్చి ఏం సాధిస్తావమ్మా? -
వేగంగా.. పారదర్శకంగా..!
[ 15-06-2024]
గత సర్కారు హయాంలో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం అమలు తీరు, మంచినీరు ఏ విధంగా అందుతుంది? జలాలపై ప్రజల అభిప్రాయ సేకరణకు ప్రస్తుత ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వే చేయిస్తోంది. -
ప్రగతి చక్రానికి రథ సారథులు
[ 15-06-2024]
ఆర్టీసీ అనగానే టక్కున గుర్తుకొచ్చేది ప్రజా రవాణా వ్యవస్థ. అన్ని వర్గాల ప్రజలను బస్సుల్లో వారివారి గమ్యస్థానాలకు చేరవేస్తుంటుంది. వీటికి సారథులుగా వివిధ విభాగాల్లో పని చేసే ఉద్యోగులే కీలకపాత్ర పోషిస్తుంటారు. -
ఎవరికీ పట్టని వలస బతుకులు
[ 15-06-2024]
వలస కార్మికుల రక్షణకు పాలకులు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి -
సొంతింటి కల నెరవేరేదెన్నడో?
[ 15-06-2024]
పేదల సొంతింటి కల నెరవేరబోతోంది. గత ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. -
రామగుండం విద్యుత్తు కేంద్రం విస్తరణపై సందిగ్ధం
[ 15-06-2024]
రామగుండం విద్యుత్తు కేంద్రం విస్తరణపై మరోసారి సందిగ్ధం నెలకొంది. మూకుమ్మడిగా అధికారులను యాదాద్రి విద్యుత్తు కేంద్రానికి డిప్యుటేషన్ కల్పిస్తూ ఆదేశాలు రావడంతో ఆందోళన నెలకొంది -
నిధులు చాలక... అంగన్వాడీ భవనాలు పూర్తికాక
[ 15-06-2024]
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆట, పాటలతో కూడిన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అయితే సొంత భవనాలు లేక చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు -
మురుగు శుద్ధి ఎప్పుడో?
[ 15-06-2024]
జిల్లా కేంద్రం.. సిరిసిల్ల పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. జనావాసాలు, డైయింగ్ యూనిట్ల నుంచి నిత్యం 20 ఎంఎల్డీ (మిలియన్ లిక్విడ్ డిఛార్జి)లకు పైగా వ్యర్థ జలాలు నేరుగా మానేరు వాగులో కలుస్తున్నాయి -
జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు దంపతులు
[ 15-06-2024]
మావోయిస్టు దంపతులు శుక్రవారం కరీంనగర్ సీపీ, వరంగల్ కమిషనరేట్ ఇన్ఛార్జి కమిషనర్ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో జనజీవన స్రవంతిలో కలిశారు. కరీంనగర్లో జరిగిన మీడియా సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు -
ద్విభాషా పుస్తకం.. అవగాహన సులభం
[ 15-06-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో ఉన్నతమైన బోధనను విద్యార్థులకు అందజేయాలన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వం ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టింది. -
ఆలయ ఉద్యోగుల్లో బదిలీల గుబులు
[ 15-06-2024]
ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన ఆలయ ఉద్యోగులకు బదిలీల గుబులు పట్టుకుంది. దీర్ఘకాలంగా ఒకేచోట పని చేస్తున్న వారికి ఈసారి స్థానచలనం తప్పదని చెబుతున్నారు. -
అప్పు తీసుకున్న వారి వేధింపులు..మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
[ 15-06-2024]
అప్పు తీసుకున్న వ్యక్తులు తిరిగి చెల్లించకపోగా చంపుతామని బెదిరించడం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. -
హమ్మయ్య.. జీతాలు వచ్చాయి
[ 15-06-2024]
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పని చేస్తున్న 200 మంది నర్సింగ్ అధికారులకు ఎట్టకేలకు జీతాలు వచ్చాయి -
పూడిక తొలగింపుతోనే.. భవిష్యత్తుకు భరోసా
[ 15-06-2024]
శ్రీరాంసాగర్ జలాశయంలో పూడిక పేరుకుని నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు తగ్గినట్లు ఇటీవలే అధికారులు గుర్తించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వచ్చే వారమే రైతుల ఖాతాల్లోకి.. పీఎం-కిసాన్ నిధులు
-
ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలపై కసరత్తు.. సీఎస్, డీజీపీలతో చంద్రబాబు భేటీ
-
మైక్రోసాఫ్ట్ విజయం వెనుక భారత్.. కొనియాడిన బిల్గేట్స్
-
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి.. త్వరలో చుక్ చుక్ పరుగులు!
-
‘కాలర్ ఐడీ’పై ట్రయల్స్ మొదలు పెట్టిన టెలికాం కంపెనీలు
-
రాష్ట్రం కోసం నీతీశ్ ఏమి చేస్తున్నారు: ప్రశాంత్ కిషోర్