నిద్రపోతున్న నిఘా.. చోరుల హల్చల్
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఉన్నతాధికారులు తరచూ సమావేశాల్లో చెబుతుంటారు. నేరాల అదుపులో సీసీ కెమెరాల పాత్ర ప్రధానమైనది.
న్యూస్టుడే, రాయికల్ పట్టణం
నేల చూపులు చూస్తున్న సీసీ కెమెరా
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఉన్నతాధికారులు తరచూ సమావేశాల్లో చెబుతుంటారు. నేరాల అదుపులో సీసీ కెమెరాల పాత్ర ప్రధానమైనది. కానీ నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయి. రాయికల్ పట్టణంలో సుమారు 40 తులాల బంగారం, లక్ష రూపాయలు నగదు చోరీ ఘటన కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో పట్టణంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సుమారు 30 సీసీ కెమెరాల పనితీరుపై, పురపాలక సంఘం ఆధ్వర్యంలో సీసీ కెమెరాల కోసం రూ.20 లక్షలు ఖర్చు చేసిన వైనంపై జోరుగా చర్చ జరుగుతోంది.
2017లో మండల కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు కాగా దాతలు, విరాళాలతో పట్టణంలో సుమారు 30 సీసీ కెమెరాలు కొనుగోలు చేసి ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర కిందట టీయూఎఫ్ఐడీసీ నిధులతో నిఘా నేత్రాల పటిష్ఠత కోసం రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నా ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అన్న అంశంపై స్పష్టత కరవైంది. దాతల సహాయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిర్వహణ కరవై తీగలు తెగడం, గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో పట్టణంలో జరిగే చోరీలు, అక్రమ రవాణాను గుర్తించడంలో పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం ఠాణాలకు భారంగానే పరిణమిస్తోంది. కెమెరాల ఏర్పాటులో దాతల సహకారం తీసుకున్నా నిర్వహణకు మళ్లీ వారిని సంప్రదించడం ఇబ్బందిగా మారుతోంది. ప్రభుత్వం ముందుకు వచ్చి నిర్వహణ బాధ్యత తీసుకుంటేనే నిఘా నేత్రాల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది. శివాజీ చౌరస్తా, అంగడిబజార్, ఇటిక్యాల క్రాస్రోడ్డు, గాంధీ చౌరస్తా భరతమాత చౌరస్తా, సర్దార్ పటేల్ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం, వారసంత, పోలీస్ ఠాణా ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు కోరుట్ల క్రాస్ రోడ్డు, అల్లూరి సీతారామరాజు విగ్రహం, కొండ బాపూజీ చౌరస్తా, విద్యా సంస్థల ఏరియాలతోపాటు ప్రధాన దేవాలయాలు, మజీద్, చర్చీల వద్ద అవకాశాన్ని బట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఉన్నతాధికారులకు నివేదించాం
పట్టణంలో దాతల సహకారంతో గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయడం లేదు. రాయికల్ ఎస్సైగా విధుల్లో చేరకముందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నా వివరాల కోసం నిజామాబాద్కు చెందిన గుత్తేదారుకు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. సీసీ కెమెరాల సమస్యపై ఉన్నతాధికారులకు నివేదించాం.
అజయ్, ఎస్సై, రాయికల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగు జిల్లాలకు కొత్త కలెక్టర్లు
[ 16-06-2024]
లోక్సభ ఎన్నికల పర్వం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 20 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగించింది. -
నాన్న కష్టమే నడిపించింది
[ 16-06-2024]
ప్రతి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేసేది అమ్మైతే.. ప్రపంచాన్ని పరిచయం చేసేది మాత్రం నాన్నే. బిడ్డలు ఎదుగుతుంటే ఆనందిస్తాడు. తన సర్వస్వాన్ని పిల్లలకు అంకితం చేస్తాడు. జీవితాన్నే బిడ్డలకు త్యాగం చేస్తాడు. -
గుర్తింపు పత్రం అందేనా..!
[ 16-06-2024]
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఏఐటీయూసీకి గుర్తింపు పత్రం ఇవ్వడంలో ఇంకా జాప్యం కొనసాగుతూనే ఉంది. -
ఆరుద్రల ఆగమనం
[ 16-06-2024]
ఎర్రని పట్టువస్త్రాన్ని కప్పుకొన్నట్లుగా చూడముచ్చటగా కనిపించే ఈ కీటకాలు ఏడాదిలో కేవలం ఆరుద్రకార్తె ఆగమనంలోనే దర్శనమిస్తాయి కాబట్టి వీటిని ఆరుద్ర పురుగులుగానే పిలుస్తారు. -
రుణ లక్ష్య సాధనలో ప్రథమం
[ 16-06-2024]
కరీంనగర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు లక్ష్యంతో దూసుకుపోతున్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
[ 16-06-2024]
మోసపూరితమైన ఆన్లైన్ యాప్ల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దని, సైబర్ నేరగాళ్లపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో సూచించారు. -
నిబంధనలు పాటించకుంటే చర్యలు
[ 16-06-2024]
ప్రైవేటు పాఠశాలల బస్సులను వాహన తనిఖీ అధికారి భీమ్సింగ్ శనివారం పరిశీలించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నేను రెండు దెబ్బలే కొట్టా.. పోలీసు విచారణలో నటుడు దర్శన్ వెల్లడి?
-
ఆగస్టు 1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు
-
స్వీయ తప్పిదాలతోనే పాస్పోర్టు జారీలో ఆలస్యం
-
ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం.. త్వరలో చెత్త పన్నుకు చెల్లు చీటీ!
-
అక్రమాలకు అడ్డాగా జగనన్న కాలనీలు.. అడ్డగోలుగా బిల్లులు విడుదల