logo

అయిదు కిలోల శిశువు జననం

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మంచిర్యాలకు చెందిన రేష్మాకు అయిదు కిలోల మగ శిశువు జన్మించినట్లు ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ జ్యోతి తెలిపారు

Published : 18 Aug 2022 06:46 IST

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మంచిర్యాలకు చెందిన రేష్మాకు అయిదు కిలోల మగ శిశువు జన్మించినట్లు ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ జ్యోతి తెలిపారు. రేష్మాకు బుధవారం ఉదయం వైద్యులు శస్త్రచికిత్స ప్రసవం నిర్వహించారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. శస్త్రచికిత్స ప్రసవంలో డాక్టర్‌ మంజుల, డాక్టర్‌ ఆయేషా, డాక్టర్‌ సంజీవరావు, పిల్లల వైద్యులు డాక్టర్‌ మల్లికార్జున్‌, హెడ్‌నర్సు ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. -న్యూస్‌టుడే, చైతన్యపురి(కరీంనగర్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని