logo

భారాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

Updated : 27 Apr 2024 12:46 IST

జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వినోద్ కుమార్, ఎమ్మెల్యే క్రికెట్ అడారు. క్రీడా కారులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి మెజార్టీ వచ్చిందని ఈసారి కూడా మంచి మెజార్టీ ఇవ్వాలన్నారు. పార్లమెంటులో తెలంగాణ ప్రజల సమస్యల పట్ల గొంతుక వినిపించేందుకు భారాస ఎంపీలను గెలిపించాలన్నారు. ప్రచారంలో భారాస నాయకులు గెల్లు శ్రీనివాస్, నారదాస్ లక్ష్మన్ రావు, బండ శ్రీనివాస్, పింగిలి రమేష్, జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్ రాజేశ్వర్ రావు, సమ్మారావు, మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని