నేనూ కేసీఆర్ బాధితుడినే!
తాను కేసీఆర్ బాధితుడినంటూ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు సంచలన విషయాలను వెల్లడించారు.
రాజకీయ ఒత్తిళ్లతో నల్గొండ ఎస్పీ పోస్టులో నుంచి నన్ను తప్పించారు
ఐజీగా పదోన్నతి కల్పనలో ఐదు నెలలు ఆలస్యం చేశారు
దర్యాప్తు అధికారికి సహకరిస్తా.. అరెస్ట్ వారెంట్ జారీ చేయొద్దు
న్యాయస్థానంలో ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు అఫిడవిట్
ఈనాడు, హైదరాబాద్: తాను కేసీఆర్ బాధితుడినంటూ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు సంచలన విషయాలను వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో ఈ అంశంపై తొలిసారి స్పందించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నల్గొండ ఎస్పీ పోస్టు నుంచి తనను అప్పటి సీఎం కేసీఆర్ అనాలోచితంగా బదిలీ చేశారన్నారు. అప్పట్లో ప్రతిపక్ష నేతలకు మద్దతిస్తున్నానని తెరాస జిల్లా నేతలు చెప్పడంతో కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. అక్కడి నుంచి సీఐడీకి బదిలీ చేశారని.. డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి కల్పించడంలోనూ ఐదు నెలలు ఆలస్యం చేశారన్నారు. కేసీఆర్ సామాజికవర్గానికి చెందినందువల్లే తనను ప్రభుత్వం ఇంటెలిజెన్స్లోకి తీసుకున్నారనేది వాస్తవం కాదన్నారు. ఎస్ఐబీలో ఎస్పీగా పదేళ్లపాటు పనిచేసిన అనుభవం ఉండటంతో అప్పటి డీజీపీ సిఫారసు చేయడం వల్లే తీసుకున్నారని పేర్కొన్నారు. తాను ఎస్ఐబీ చీఫ్గా ఉన్నప్పుడు అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ పర్యవేక్షణలోనే పనిచేశానని.. ప్రతి అంశాన్ని వారి దృష్టిలో ఉంచానని వెల్లడించారు. అక్కడ స్వతంత్రంగా పనిచేసే అధికారం తనకు ఉండదన్నారు. 30 ఏళ్ల సర్వీసులో ప్రతిభ కారణంగా తనకు 2012లో ప్రతిష్ఠాత్మక ఐపీఎం, 2016లో పీఎంజీ, 2019లో పీపీఎం, అసాధారణ్ ఆసూచన కుశలత పతకాలు లభించాయన్నారు. తనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ దర్యాప్తు సంస్థ న్యాయస్థానంలో దరఖాస్తు చేయడం సరికాదన్నారు. తాను హైదరాబాద్లోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నానని.. ప్రస్తుతం అమెరికాలోని ఇల్లినోయీ పాంటియాక్లో ఉన్నానని.. నాలుకపై ట్యూమర్కు చికిత్స పూర్తయిన అనంతరం తప్పనిసరిగా దర్యాప్తు అధికారి ముందు హాజరవుతానని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ దరఖాస్తును కొట్టివేయాలని కోరారు. ప్రభాకర్రావు తరఫున న్యాయవాది సురేందర్రావు ఈ అఫిడవిట్ సమర్పించారు.
జీవితాన్ని పణంగా పెట్టి పనిచేశా..
అఫిడవిట్లోని వివరాల మేరకు.. ‘నేను జీవితాన్ని పణంగా పెట్టి తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాల అణచివేత కోసం పనిచేసి వారికి లక్ష్యంగా మారా. నన్ను హిట్ లిస్ట్లో చేర్చారు. 30 ఏళ్ల సర్వీసులో మూడొంతుల కాలం ఇదే విభాగంలో పనిచేసి ఐబీ, కేంద్ర హోంశాఖ, ఇతర రాష్ట్రాల ఇంటెలిజెన్స్ శాఖల నుంచి, నైతిక విలువలు పాటించే విషయంలో తోటి పోలీస్ అధికారులు, సీనియర్ల నుంచి ప్రశంసలు పొందా. నాలుకపై ట్యూమర్ ఏర్పడిన కారణంగా 2004-10 మధ్య కాలంలో పలు సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. అప్పటినుంచి క్రమంతప్పకుండా వైద్యుల్ని సంప్రదిస్తున్నా. కొవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత 2023 మార్చిలో గొంతు, ఊపిరితిత్తుల్లో సమస్యలొచ్చాయి. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత అమెరికా వెళ్లి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించి చికిత్స పొందాలనుకున్నా. అమెరికా పౌరుడైన నా బంధువు రంగినేని విజయ్ ద్వారా అక్కడ నిపుణులైన వైద్యులను సంప్రదించా. ఆహారం మింగడంలో అసౌకర్యం కలగడంతోపాటు అలసట లక్షణాలు కనిపించడంతో నా భార్యతోపాటు అమెరికా వెళ్లేందుకు గత ఫిబ్రవరి 15న టికెట్లు బుక్ చేసుకున్నా. జూన్ 26న తిరిగివచ్చేందుకు సైతం టికెట్ బుక్ చేసుకున్నా.
దర్యాప్తు అధికారులను మార్చిలోనే సంప్రదించా..
నా రాజీనామా సమర్పించిన మూడు నెలల తర్వాత అమెరికా వచ్చా. ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ గురించి అధికారులెవరూ నన్ను సంప్రదించలేదు. కేసు నమోదైన సంగతి తెలిసిన తర్వాత దర్యాప్తు అధికారితోపాటు ఉన్నతాధికారులను సంప్రదించా. మార్చి 22, 23 తేదీల్లో దర్యాప్తు అధికారిని.. 23న హైదరాబాద్ కమిషనర్, వెస్ట్జోన్ డీసీపీలను ఫోన్లో సంప్రదించి దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పా. కుటుంబ సభ్యులను వేధించొద్దని కోరా. అమెరికాలోని నా కాంటాక్టు నంబర్ను, మెయిల్ ఐడీని ఇచ్చా(ఇందుకు సంబంధించిన వాట్సప్ స్క్రీన్షాట్లను కోర్టుకు సమర్పించారు). కానీ, దర్యాప్తు అధికారులెవరూ కేసు గురించి నన్ను సంప్రదించలేదు. అమెరికా ప్రయాణ కారణాల గురించి ఏప్రిల్ 19, 24 తేదీల్లో సీఆర్పీసీ 91 సెక్షన్ కింద దర్యాప్తు అధికారి అడిగిన సమాచారాన్ని నా కుమారుడు నిషాంత్రావు అందించారు. వైద్య పరీక్షలు పూర్తయి ప్రయాణం చేయొచ్చని వైద్యులు సూచించిన వెంటనే భారత్కు తిరిగివస్తా’ అని అఫిడవిట్లో ప్రభాకర్రావు పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్లో నా పాత్ర లేదు: శ్రవణ్రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై పోలీసులు సీఆర్పీసీ 73 సెక్షన్ మోపడం సరికాదని ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ పేర్కొన్నారు. తన అరెస్టుకు అనుమతివ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని కోరారు. ఈ మేరకు తాజాగా నాంపల్లి కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాకెలాంటి పాత్రలేదు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. ముందస్తుగా నిర్ణయించుకున్న బిజినెస్ షెడ్యూలు ప్రకారం 2024 మార్చి 15న లండన్ వెళ్లాను. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నా సోదరి బాగోగులు చూసుకోవడానికి మా బావ వినతి మేరకు అత్యవసరంగా మార్చి 20న అమెరికాకు వెళ్లాను’’ అని తన పిటిషన్లో పేర్కొన్నారు. తాను భారత్కు తిరిగొచ్చేవరకూ ఫోన్ నంబరు ద్వారా అందుబాటులో ఉంటానని.. భారత్కు తిరిగొచ్చాక కేసు దర్యాప్తునకు సహకారం అందిస్తానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. -
మే 20న తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో...
Telangana ECET Results: తెంగాణ ఈసెట్ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం results.eenadu.net చూడండి. -
వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు
వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది. -
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
మంత్రి మండలి సమావేశం వాయిదా
తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. -
ముందస్తు వానాకాలం
రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. -
ఎప్సెట్ ఇంజినీరింగ్లో 74.98% ఉత్తీర్ణత
టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బొగ్గు తరలింపుపై ప్రతిష్టంభన
సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. వర్షాకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్ అధికారులను నియమించారు. -
మాదంటే మాదే!
భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..