యువత మెచ్చేలా కొత్త పథకాలు
కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది.
సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న సేవలు
వృద్ధి బాటలో కొనసాగుతాం
‘ఈనాడు’తో కెనరా బ్యాంకు ఎండీ, సీఈఓ కె.సత్యనారాయణ రాజు
ఈనాడు - హైదరాబాద్
కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది. ఖాతాదార్లకు మరింత చేరువయ్యేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 250కి పైగా కొత్త శాఖలు ప్రారంభిస్తామని కెనరా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కె.సత్యనారాయణ రాజు ‘ఈనాడు’కు వెల్లడించారు. మహిళలు, యువతను ఆకర్షించేలా 2 కొత్త పథకాలు తీసుకు వచ్చినట్లు తెలిపారు. మహిళల కోసం తీసుకొచ్చిన ‘కెనరా ఏంజెల్’ అనే సేవింగ్ ఖాతా పథకం కింద రూ.10 లక్షల వరకు కేన్సర్ చికిత్సకు, ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలకు అయ్యే ఖర్చులకు బీమా సదుపాయం లభిస్తుంది. యువతకు అనువైన సదుపాయాలతో రూపొందించిన ‘కెనరా హీల్’ పథకానికీ మంచి స్పందన లభిస్తోందని అన్నారు.
స్వయం సహాయక బృందాల వద్దకే ఉద్యోగి
కృత్రిమ మేధ(ఏఐ)/ మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) సాంకేతిక పరిజ్ఞానంతో, యువతను ఆకర్షించేలా మెరుగైన సేవలు అందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే చాట్ బాట్, ఐవీఆర్ఎస్లలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, మరిన్ని విభాగాలకు ఈ పరిజ్ఞానాన్ని విస్తరించనున్నామని తెలిపారు. స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీ) వారు ఖాతా తెరవడం, రుణం పొందటం, వాయిదాలు తిరిగి చెల్లించడం వరకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చూసేందుకూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని వెల్లడించారు. తమ బ్యాంకు ఉద్యోగే ఆయా బృందాల వద్దకు వెళ్లి ఖాతా తెరవడం నుంచి ఇతర సేవలన్నింటినీ అందిస్తారని; దేశవ్యాప్తంగా ఉన్న కెనరా బ్యాంకు శాఖలన్నింటిలోనూ ఈ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. బెంగళూరులోని ఆర్బీఐ ఇన్నోవేషన్ సెంటర్తో కలిసి దీనికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇటువంటి సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన తొలి బ్యాంకు తమదేనని తెలిపారు.
స్థిరమైన వృద్ధి
వచ్చే రెండు, మూడేళ్ల పాటు ఏటా స్థిర వృద్ధి సాధించేందుకు బ్యాంకును పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు సత్యనారాయణ రాజు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల్లో 12%, డిపాజిట్లలో 9% వృద్ధి లక్ష్యమని తెలిపారు. నికర వడ్డీ మిగులు (ఎన్ఐఎం) 3% కంటే తగ్గదని తెలిపారు.
ఆకర్షణీయ ఫలితాలు
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి కెనరా బ్యాంకు ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. దాదాపు 18% వృద్ధితో మార్చి త్రైమాసికానికి రూ.3,757 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. వడ్డీ ఆదాయం పెరగడం, పారు బాకీలు తగ్గడం ఇందుకు నేపథ్యం. గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలానికి రూ.14,554 కోట్ల నికరలాభం, రూ.80.23 ఈపీఎస్ నమోదైంది. 2022-23లో నికరలాభం రూ.10,603 కోట్లు, ఈపీఎస్ రూ.58.45 మాత్రమే ఉన్నాయి. స్థూల నిరర్థక ఆస్తులు 4.23 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 1.27 శాతానికి తగ్గాయి. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, కెనరా రొబెకో మ్యూచువల్ ఫండ్ సంస్థలు పబ్లిక్ ఇష్యూకు వెళ్లే సమయంలో, బ్యాంక్ వాటా విక్రయించే అవకాశం ఉందని తెలిపారు.
161% డివిడెండు: రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.16.10 (161%) డివిడెండ్ చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. ప్రస్తుతం రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ.2 ముఖ విలువ గల 5 షేర్లుగా విభజించేందుకు, ఈ నెల 15వ తేదీని రికార్డు తేదీగా నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ పెట్టుబడులు రూ.43,000 కోట్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల ప్రణాళికను టాటా మోటార్స్ గ్రూప్ మరింత పెంచుకుంది. -
జీడీపీ వృద్ధి 6.7శాతం!
గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. -
కృత్రిమ మేధపై వ్యయాలు మూడింతలు
మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ)పై వ్యయాలు 2027 నాటికి మూడింతలు పెరిగి 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్ల)కు చేరొచ్చని ఇంటెల్-ఐడీసీ నివేదిక వెల్లడించింది. -
వ్యాపార వృద్ధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు అగ్రస్థానం
గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల మొత్తం వ్యాపారం, డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధిరేటును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నమోదు చేసింది. -
2024లో ఈక్విటీ ఫండ్లలోకి రూ.1.3 లక్షల కోట్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మ్యూచువల్ ఫండ్లు (ఎంఎఫ్) ఎంతో నమ్మకం ఉంచుతున్నాయి. ఈ ఏడాది (2024)లో ఇప్పటికే సుమారు రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ఇందుకు నిదర్శనం. -
మేమూ వినియోగించుకునే అవకాశమివ్వండి
విమాన ఇంధన (ఏటీఎఫ్) సరఫరా, నిల్వ కోసం ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగించుకుంటున్న పైపులైన్లు, నిల్వ కేంద్రాలను తమకూ అందుబాటులోకి తేవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రభుత్వాన్ని కోరింది. -
పసుపు కిందకు!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.74,412 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్కు మరిన్ని చిక్కులు
అగ్రగామి మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్లకు చెందిన మసాలా పొడుల ఉత్పత్తుల్లో నాణ్యతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు న్యూజిలాండ్ ఆహార భద్రతా సంస్థ వెల్లడించింది. -
చైనా స్థిరాస్తి రంగానికి ఊరట
దీర్ఘకాలంగా క్షీణిస్తున్న స్థిరాస్తి రంగాన్ని ఆదుకోవడానికి చైనా చర్యలు ప్రకటించింది. అమ్ముడుపోని గృహాలను, భూములను తిరిగి కొనుగోలు చేయడానికి వందల కోట్ల డాలర్లను కేటాయించింది. -
భారత్ వృద్ధి 6.6%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి రేటును నమోదు చేయొచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. -
సంక్షిప్త వార్తలు
ఎడ్టెక్ సంస్థ బైజూస్ సలహా మండలి నుంచి ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్దాస్ పాయ్ వైదొలగనున్నారు. -
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
Mobile Apps: స్మార్ట్ఫోన్ వినియోగదారులు కచ్చితంగా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ స్టోర్, గోప్యతా విధానాలు, డేటా సేకరణ, సమీక్షలు, మానిటైజేషన్ పద్ధతులు, వివిధ అనుమతుల వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..