రాజధానిలో భారీ వర్షాలకు 14 మంది మృత్యువాత
రాజధాని నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాతపడ్డారు.
బాచుపల్లిలో అపార్ట్మెంట్ ప్రహరీ కూలి ఏడుగురి దుర్మరణం
వేర్వేరు ఘటనల్లో మరో ఏడుగురు..
ఈనాడు, హైదరాబాద్- న్యూస్టుడే బృందం: రాజధాని నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో 10 మంది ఇతర రాష్ట్రాల వలస కార్మికులే ఉన్నారు. ఆయా ఘటనలపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇవీ.. బాచుపల్లిలో కౌసల్యకాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ ప్రహరీ మంగళవారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయి దానిని ఆనుకొని ఉన్న రేకులషెడ్డుపై పడటంతో అందులో నివసిస్తున్న ఏడుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఐదంతస్తుల భవనాన్ని రైజ్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక్కడ గతంలో 10-15 అడుగుల ఎత్తు వరకు ప్రహరీని నిర్మించారు. తరువాత దానినే 30-40 అడుగులకు పెంచడంతో వర్షపు నీటికి పునాదులు బలహీనపడి కూలిపోయింది. మృతుల్లో ఛత్తీస్గఢ్కు చెందిన దంపతులు రాముయాదవ్(44), గీతాబల్(40), వీరి కుమారుడు హిమాన్షు(4), ఒడిశాకు చెందిన శంకదేబ్గౌడ్(18), శ్రీపతి మాజి(23), మహారాష్ట్రకు చెందిన దంపతులు బింద్రేశ్ భవానీచౌహాన్(30), ఖుషి(20) ఉన్నారు. నిర్మాణంలో నిర్లక్ష్యానికి కారణమైన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్రావు, బాచుపల్లి ఇన్స్పెక్టర్ ఉపేందర్రావు తెలిపారు. అలాగే మొయినాబాద్ మండలం చిన్నమంగళారానికి చెందిన జహేరాబేగం(47) మంగళవారం రాత్రి కూరగాయలు కొనేందుకు బయటకు రాగా.. స్వాగత తోరణం విరిగి ఆమె తలపై పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు.
విద్యుదాఘాతంతో ఐదేళ్ల బాలుడు సహా ముగ్గురు
హయత్నగర్ ముదిరాజ్ కాలనీకి చెందిన అంజలి బుధవారం ఉదయం పెద్దఅంబర్పేట్ పురపాలిక పరిధిలో ఇంటింటి చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోలో తన ముగ్గురు పిల్లలను వెంట తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి భారీ గాలులకు కుంట్లూర్ సన్రైజ్ కాలనీ రోడ్డు 3లో విద్యుత్ తీగ తెగిపడింది. దీనిని గమనించిన అంజలి సమీపంలోని భవన నిర్మాణ కార్మికులను పిలుచుకురావడానికి వెళ్లారు. ఈలోపు ఆటో దిగిన ఆమె కుమారుడు శివశంకర్(5) తీగను తగలడంతో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్కు చెందిన షేక్ పర్వేజ్(40) వర్షంలో తన పంక్చర్ దుకాణం బయట ట్యూబ్లైట్ తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. బిహార్కు చెందిన దమేంద్ర కుమార్యాదవ్(33) చందానగర్లోని గంగారంలో తాను పని చేసే టీ బండిని విద్యుత్ స్తంభానికి గొలుసుతో కడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు.
మూసారాంబాగ్ మెట్రోస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి(45) మంగళవారం రాత్రి వర్షానికి జారి పడి అపస్మారక స్థితికి చేరారు. ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు చేరుకొని పరిశీలించగా అప్పటికే మృతిచెందారు.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
బాధితులను ఆదుకోవాలని ఆదేశాలు
బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతిచెందడంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నాలాలో పడి కార్మికుల మృతి
ఒడిశాకు చెందిన చంద్ర పాండా(38), మనోజ్ దాస్(45)లు పదేళ్ల కిందట నగరానికి వచ్చారు. నెల రోజులుగా బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో నివసిస్తూ అమీర్పేటలోని ఓ హోటల్లో పనిచేసేవారు. మంగళవారం సాయంత్రం వారి ఇంటికి సమీపంలోని బారుకెళ్లి మద్యం తాగారు. అనంతరం బయటకు వచ్చిన ఇద్దరూ భారీ వర్షంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బేగంపేట నాలాలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందారని బేగంపేట ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. -
మే 20న తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో...
Telangana ECET Results: తెంగాణ ఈసెట్ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం results.eenadu.net చూడండి. -
వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు
వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది. -
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
మంత్రి మండలి సమావేశం వాయిదా
తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. -
ముందస్తు వానాకాలం
రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. -
ఎప్సెట్ ఇంజినీరింగ్లో 74.98% ఉత్తీర్ణత
టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బొగ్గు తరలింపుపై ప్రతిష్టంభన
సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. వర్షాకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్ అధికారులను నియమించారు. -
మాదంటే మాదే!
భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..