చోరీ కేసు నిందితుడి అరెస్టు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ నీలం రవి తెలిపారు.
కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ నీలం రవి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. జనవరి 31న అప్పారావుపేట గ్రామానికి చెందిన రొండ్ల ప్రమీల తీర్థయాత్రలకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఇంటి తాళం పగులగొట్టి 30 గ్రాముల బంగారు గొలుసు, పది గ్రాముల బంగారు బిస్కెట్, 160 గ్రాముల వెండి, 150 గ్రాముల వెండి పాదరక్షలు, డైమండ్ చెవి రింగులు, సుమారు రూ.10 వేల నగదు చోరీ చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు జగిత్యాల జిల్లాలోని దొంగలమర్రి చెక్పోస్టు వద్ద గురువారం ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా వెళ్తూ కనిపించగా ఎస్సై సందీప్ వెంబడించారు. ముగ్గురు వ్యక్తుల్లో ఒకరైన హనుమకొండ జిల్లా గోపాల్పూర్(నయీంనగర్)కు చెందిన పాశం పవన్ను పట్టుకోగా మిగతా ఇద్దరు మహబూబ్నగర్ జిల్లా రాజపేటకు చెందిన రథాస్వామి, మహబూబ్నగర్ పట్టణానికి చెందిన అంజి పరారైనట్లు తెలిపారు. ముగ్గురు కలిసి గతంలో పలు చోరీల్లో నిందితులుగా ఉన్నారని, పవన్ వద్ద ఒక జత వెండి పట్టా గొలుసులు, చరవాణి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు, మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సీఐ వివరించారు.
భూకబ్జాకు యత్నం.. ఇద్దరిపై కేసు
చొప్పదండి, న్యూస్టుడే: తప్పుడు పత్రాలతో భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన ముద్దసాని కొమురయ్య, లంక శేఖర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. రుక్మాపూర్కు చెందిన ముద్దసాని రంగయ్య, వంగ నరేష్, చొప్పదండికి చెందిన గుర్రం రాజేందర్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి 2017లో లంక రాజయ్య 35 గుంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సదరు భూమి తనదంటూ ముద్దసాని రాజయ్య కోర్టును ఆశ్రయించగా నలుగురు లోక్అదాలత్లో రాజీ కుదుర్చుకున్నారు. అనంతరం సదరు భూమి అమ్ముకోవడానికి ఏమైనా అభ్యంతరాలుంటే సంప్రదించాలని పత్రిక ప్రకటన ఇచ్చారు. ఆ భూమిని రుక్మాపూర్కు చెందిన కొమురయ్య, శేఖర్ 2013లో రాజయ్య దగ్గర కొనుగోలు చేసినట్లు సాదాబైనామా కాగితాన్ని సృష్టించి.. భూమిపై తమకే హక్కు ఉందని పత్రిక ప్రకటన ఇచ్చారు. రంగయ్య ఫిర్యాదు మేరకు కొమురయ్య, శేఖర్లపై కేసు నమోదు చేసి.. కొమురయ్యను అరెస్టు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
పోలీసు కస్టడీకి నలుగురు భూ ఆక్రమణ నిందితులు
కరీంనగర్ నేరవార్తలు, న్యూస్టుడే: నకిలీ పత్రాలు సృష్టించి భూ ఆక్రమణకు పాల్పడిన నలుగురిని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని గురువారం విచారించినట్లు కరీంనగర్ రూరల్ సీఐ ప్రదీప్కుమార్ తెలిపారు. తన భూమిపై కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించమే కాకుండా, పలు విధాలుగా బెదిరింపులకు పాల్పడినట్లు బ్యాంక్కాలనీకి చెందిన దొమ్మటి యుగేందర్ కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ సుదగోని మాధవి, ఆమె భర్త కృష్ణగౌడ్, కొత్త జయపాల్రెడ్డి, మున్సిపల్ ఆర్ఐ జంకే శ్రీకాంత్, బిల్ కలెక్టర్ కొత్తపల్లి రాజుతో మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో మహ్మద్ ఫిరోజ్ఖాన్, కాంపల్లి రామాంజనేయులు, జంకే శ్రీకాంత్, కొత్తపల్లి రాజులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైల్లో ఉన్న నలుగురిని గురువారం పోలీసులు కస్టడీకి తీసుకొని వారి ఇళ్లను సోదాలు చేశారు.
బుల్డోజర్ ముఠా సభ్యులు...
కరీంనగర్ నేరవార్తలు : నకిలీ ఇంటి పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుల ఇళ్లను కూల్చివేసి భయాందోళనకు గురి చేసిన బుల్డోజర్ ముఠా సభ్యులను కోర్టు అనుమతితో గురువారం కస్టడీలోకి తీసుకొని విచారించినట్లు కరీంనగర్ రూరల్ సీఐ ప్రదీప్కుమార్ తెలిపారు. కరీంనగర్ ఆదర్శనగర్కు చెందిన మహ్మద్ లతీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలరాజు రత్నాకర్, చందా శంకర్రావు, బకిట్ సాయి, పిట్టల మధు, షాహిద్ ఖాన్లను అరెస్టు చేసి జైలుకు పంపించారు. గురువారం జైల్లో ఉన్న వారిని కస్టడీకి తీసుకొని విచారించినట్లు సీఐ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
[ 17-05-2024]
భూ తగాదాల నేపథ్యంలో జరిగిన గొడవ ఓ కుటుంబంలో విషాదం నింపింది. -
ఇక ‘స్థానికం’!
[ 17-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఈవీఎంలో పదిలమైందో లేదో.. అటు నాయకులు, ఇటు అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. -
పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు
[ 17-05-2024]
వర్షాకాలంలో దోమలతో మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. దీనికి కారణం పారిశుద్ధ్యం లోపించడం, తాగునీరు కలుషితం కావడం. -
కళల మెరుపులు.. నైపుణ్యానికి మెరుగులు
[ 17-05-2024]
కరీంనగర్ బాలభవన్ వేసవి శిక్షణ శిబిరం సందడిగా మారింది. గతంతో పోల్చితే ఈసారి అధిక మంది శిక్షణ పొందుతున్నారు. పిల్లలంతా స్వేచ్ఛగా తమకు నచ్చిన అంశాలు నేర్చుకుంటున్నారు. -
హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
[ 17-05-2024]
రాష్ట్రంలో రైతులను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం చొప్పదండిలో భారాస నేతలతో కలిసి నిరసన తెలియజేసి మాట్లాడారు. -
ఉప కులపతిగా అవకాశం దక్కేదెవరికో?
[ 17-05-2024]
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలం ఈనెల 21తో ముగియనుండంతో నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. -
ఓట్ల పండుగ.. ఆర్టీసీకి ఆదాయం దండిగా!
[ 17-05-2024]
లోక్సభ ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అధిక మంది వారివారి స్వస్థలాలకు బయలుదేరారు. పిల్లలకు కూడా వేసవి సెలవులు కావడంతో తమ ప్రాంతాలకు వెళ్లడానికి ఆసక్తి చూపారు. -
నారసింహుడి కోవెలలో నగదు రహిత సేవలకు శ్రీకారం
[ 17-05-2024]
దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నగదు రహిత సేవలకు శ్రీకారం చుట్టారు. -
పెరిగిన గడువు.. అవకాశం మెరుగు
[ 17-05-2024]
సింగరేణిలో ఉద్యోగ నియామకాలకు మరి కొంత మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది. మే 4 వరకు దరఖాస్తులకు చివరి గడువు విధించిన యాజమాన్యం తాజాగా జూన్ 4 వరకు పెంచింది. -
అకాల వర్షాలతో అన్నదాతల్లో ఆందోళన
[ 17-05-2024]
అకాల వర్షాలు, ఈదురు గాలులు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. -
‘పల్లె’వించిన చైతన్యం..
[ 17-05-2024]
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంలో పల్లెలు స్ఫూర్తి చాటాయి. నగర వాసుల కంటే గ్రామీణ ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. -
సహజ వనరులను కొల్లగొడుతున్నారు
[ 17-05-2024]
ఇసుక, మట్టి అక్రమ రవాణాతో జిల్లాలోని సహజవనరులను అక్రమార్కులు ధ్వంసం చేస్తున్నారు. మానేరు వాగు నుంచి ఇసుక రవాణాపై చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు గాలికి వదిలేయడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. -
అనుసంధాన మార్గం పూర్తయ్యేనా!
[ 17-05-2024]
నిత్యం రద్దీగా ఉండే గ్రామాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారి నిర్మాణం ఆది నుంచీ నిర్లక్ష్యానికి గురవుతోంది.నిత్యం రద్దీగా ఉండే గ్రామాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారి నిర్మాణం ఆది నుంచీ నిర్లక్ష్యానికి గురవుతోంది. -
ప్రారంభించారు... తాళం వేశారు
[ 17-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ఆరోగ్య ఉప కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించింది. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలను పాలకులు ఆర్భాటంగా ప్రారంభించారు. -
రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే
[ 17-05-2024]
పార్లమెంటు ఎన్నికల తర్వాత ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామనడం రైతాంగాన్ని మరోసారి మోసం చేయడమేనని భారాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. -
ముందుకు సాగని ఆలయ విస్తరణ పనులు
[ 17-05-2024]
దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీబద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. -
లైసెన్స్ లేకుండా మందులు విక్రయించిన వ్యక్తికి ఏడాది జైలు
[ 17-05-2024]
లైసెన్స్ లేకుండా అల్లోపతి మందులు నిల్వచేయడంతోపాటు అమ్మకాలు చేపట్టిన ఓ వ్యక్తికి కోరుట్ల న్యాయస్థానం ఏడాది జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధించింది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
[ 17-05-2024]
పెద్దపల్లిలోని రైల్వేస్టేషన్లో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రామగుండం జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
-
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు
-
అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
-
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్