logo

వడదెబ్బతో ఎంఈవో మృతి!

వెల్గటూరు మండల విద్యాధికారి బత్తుల భూమయ్య(55) వడదెబ్బతో మృతి చెందాడు. ఎన్నికల విధుల్లో భాగంగా వాహన తనిఖీ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న భూమయ్య...

Updated : 04 May 2024 11:23 IST

ధర్మపురి గ్రామీణం: వడదెబ్బతో మండల విద్యాధికారి (ఎంఈవో) బత్తుల భూమయ్య (55) మృతిచెందినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన చొప్పదండిలో చోటుచేసుకుంది. వెల్గటూరు మండల విద్యాధికారిగా ఆయన పనిచేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా వాహన తనిఖీ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన భూమయ్య.. చొప్పదండిలోని తన ఇంట్లో శనివారం ఉదయం మృతి చెందారు. ధర్మపురి, బుగ్గారం ఇన్‌ఛార్జ్ ఎంఈఓగానూ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని